ఐటీ శాఖ నుండి నోటీసులు అందుకున్న సాప్ట్వేర్ దిగ్గజం విప్రో
oi
-Staff
By Super
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో 2008-09 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నుంచి స్క్రూటినీ నోటీసులు అందినట్లు వెల్లడించింది. ఇది సర్వసాధారణంగా జరిగేదేనని, ఐటీ శాఖ సందేహాలను నివృత్తి చేయగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ఆన్షోర్ సర్వీసులను సైతం సాఫ్ట్వేర్ ఎగుమతులుగా చూపిస్తూ తప్పుడు పద్ధతుల్లో పన్ను మినహాయింపులు పొందిందంటూ మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు సైతం ఆదాయపన్ను శాఖ ఇటీవలే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.