వేటకత్తితో కిరాతకంగా దాడి.. కీలకంగా సీసీ కెమెరా ఫుటేజ్!

|

బెంగుళూరు నగరంలో మంగళవారం చోటు చేసుకున్న ఓ భయానక ఘటన యావత్ ప్రపంచాన్ని గగుర్పాటుకు గురిచేసింది. గ్రీన్ సిటీలోని ఓ కార్పొరేషన్ ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వచ్చిన మహిళ పై గుర్తుతెలియన వ్యక్తి వేట కొడవలితో అత్యంత కిరాతకంగా దాడికి ఒడిగట్టాడు. ఈ కిరాతక దాడికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ వెబ్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

వేటకత్తితో కీరాతకంగా దాడి.. కీలకంగా సీసీ కెమెరా ఫుటేజ్!

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.... బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగరిలో నివశించే జ్యోతి ఉదయ్ (38), మిషన్ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకులో సెక్షన్ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జ్యోతి..మంగళవారం ఉదయం 7.30 సమయంలో తన విధులు హాజరయ్యేందుకు వెళ్తూ కార్పొరేషన్ బ్యాంక్ కూడలి వద్ద ఉన్న ఏంటీఎంలో నగదు తీసుకునేందుకు వెళ్లారు. ఆ సయంలో ఏటీఎం వద్ద భద్రతా సిబ్బంది లేరు. ఈ సమయంలో లోనికి చొరబడిన వ్యక్తి సెకన్లవ్యవధిలోనే ఏటీఎం షట్టర్‌ను క్రిందకు దించి వేటకొడవలితో ఆమెను బెదిరించాడు. ప్రతిఘటించిన బాధితురాలు అలారాన్ని మోగించేందకు యత్నించగా, ఆమెను క్రిందకు తోసేసిన అగంతుకుడు ఓ వైపు పిస్తోలుతో బెదిరిస్తూ, మరోవైపు ఆమె తలపై వేటకత్తితో పలుమార్లు దాడి చేసినట్లు ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. రక్తపుమడుగులో ఉన్న బాధితురాలను గమనించిన ఇద్దరు విద్యార్థులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.

కీలకంగా సీసీటీవీ ఫుటేజ్:

ఈ ఘటనకు సంబంధంచి ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు పోలీసులకు కీలకంగా మారాయి. దాడి సమయంలో బాధితురాలి వ్యానిటీ బ్యాగులో ఉన్న ఒక పర్సును దాడి చేసిన వ్యక్తి జేబులో పెట్టుకోవటాన్ని పోలీసులు గుర్తించారు.

వీడియో మూలం: యూట్యూబ్

<center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/SXQxZwB58TE? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X