జనవరి 28న మార్కెట్లోకి షియోమీ ఎంఐ 4

గతేడాది ఎంఐ 3 స్మార్ట్ఫోన్తో భారత్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన చైనా ఫోన్ల కంపెనీ షియోమీ ఈ ఏడాదికిగాను ఎంఐ 4 ఫోన్తో పాటు ఎంఐ నోట్, ఎంఐ నోట్ ప్రో ఫోన్లను అంతర్జాతీయ మార్కెట్లో ప్రదర్శించింది. ఎంఐ 3 మోడల్కు సక్సెసర్ వర్షన్గా విడుదలైన ‘ఎంఐ 4' ను ఈ నెలాఖరు నాటికి భారత్లో విడుదల చేస్తామని, ఫిబ్రవరి నుంచి మార్కెట్లో లభ్యమవుతుందని షియోమీ ఇండియా హెడ్ మను జెయిన్ ఇటీవల వెల్లడించారు. తాజాగా వెల్లడవుతోన్న వివరాల మేరకు షియోమీ ఎంఐ4 ఈ నెల 28న మార్కెట్లో విడుదలవుతుంది. ఫిబ్రవరి 3 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది.
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్డేట్స్ పొందండి
షియోమీ ఎంఐ 4 కీలక స్పెసిఫికేషన్లు:
5 అంగుళాల డిస్ప్లే,
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
షియోమీ ఎంఐ 4 ఫోన్లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా విక్రయించనుంది. ఫోన్ ధర అంచనా రూ.17,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చు..


Click it and Unblock the Notifications








