Home
News

Xiaomi నకిలీ ఉత్పత్తులు పట్టివేత!!! రూ.33.3 లక్షల వరకు విలువ ఉండే అవకాశం...

ఇండియా యొక్క మార్కెట్లో షియోమి సంస్థకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం Mi పేరుతో కొన్ని నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీటి గురించి వినియోగదారులు తెలుసుకోవాలని ఇప్పటికే షియోమి సంస్థ హెచ్చరించింది. స్థానిక పోలీసు స్టేషన్లలో కంపెనీ ఫిర్యాదులు చేసిన తరువాత అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో మార్కెట్లో దాడులు జరిగాయి. ఇప్పుడు కొత్తగా చెన్నైలో మరియు బెంగళూరులో కొంత మంది సరఫరాదారుల నుండి రూ.33.3 లక్షల విలువైన Mi నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

షియోమి నకిలీ ఉత్పత్తుల మొత్తం విలువ

షియోమి నకిలీ ఉత్పత్తుల మొత్తం విలువ

ఇటీవల చెన్నై మరియు బెంగళూరులో జరిగిన పోలీసుల దాడులలో మొబైల్ బ్యాక్ కేసులు, హెడ్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు మరియు ఇయర్‌ఫోన్‌లతో కూడిన 3 వేలకు పైగా నకిలీ ఉత్పత్తులు దొరికాయని షియోమి ఇండియా పత్రిక సమావేశంలో తెలిపింది. వీటి యొక్క విలువలు వరుసగా 24.9 లక్షల రూపాయలు, రూ .8.4 లక్షల విలువ కలిగి ఉన్నట్లు Mi ఇండియా తెలిపింది. Mi యొక్క ఈ నకిలీ ఉత్పత్తులను విక్రయించినందుకు రెండు నగరాలలోని దుకాణ యజమానులను అరెస్టు చేసినట్లు కంపెనీ తెలిపింది.

 

షియోమి నకిలీ ఉత్పత్తులు

షియోమి నకిలీ ఉత్పత్తులు

పోలీసుల విచారణలో రెండు నగరాలలో ఈ సరఫరాదారులు ఈ వ్యాపారాన్ని చాలా కాలంగా నిర్వహిస్తున్నారని మరియు మార్కెట్లో ఇప్పటికే చాలా రకాల నకిలీ ఉత్పత్తులను విక్రయించినట్లు కనుగొనబడింది. నకిలీ ఉత్పత్తుల కొనుగోలుతో కస్టమర్ అనుభవాన్ని దిగజార్చడమే కాకుండా వినియోగదారుల ఆరోగ్యానికి మరియు భద్రతకు పెద్ద ముప్పు ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే వినియోగదారుల యొక్క గోప్యత మరియు డేటా భద్రతకు కూడా హాని కలిగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇవి మరింత ప్రమాదకరంగా కూడా ఉండే అవకాశం ఉంది.

షియోమి ఇండియా టాస్క్‌ఫోర్స్‌

షియోమి ఇండియా టాస్క్‌ఫోర్స్‌

షియోమి ఇండియా నకిలీ ఉత్పత్తులను కనుగొనడానికి ఇండియాలో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా కొత్తగా సృష్టించింది. ఇది ఇండియా యొక్క మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి మరియు నకిలీ ఉత్పత్తుల తయారీ సంస్థలకు వ్యతిరేకంగా పనిచేయడానికి బాధ్యత వహిస్తుంది. బ్రాండ్ మరియు భాగస్వామి అవుట్లెట్ల యొక్క అధీకృత దుకాణాల నుండి మాత్రమే "నిజమైన" ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కంపెనీ వినియోగదారులకు సూచించింది.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో షియోమి అమ్మకాలు

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో షియోమి అమ్మకాలు

భారతదేశంలో పండుగ సీజన్లో షియోమి కంపెనీ 13 మిలియన్లకు పైగా తన యొక్క అన్ని రకాల డివైస్లను విక్రయించినట్లు షియోమి సంస్థ గత వారంలో వార్తలో పేర్కొంది. గత నెలలో పండుగ సీజన్ కోసం అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరియు బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలను నిర్వహించింది. అదనంగా షియోమి Mi ఫెస్టివల్ సేల్ ను కూడా భారీ డిస్కౌంట్లతో నిర్వహించింది.

దీపావళి అమ్మకంలో Mi స్మార్ట్‌ఫోన్‌ల సేల్స్

దీపావళి అమ్మకంలో Mi స్మార్ట్‌ఫోన్‌ల సేల్స్

ఇండియాలో దీపావళి పండుగ సందర్భంగా షియోమి సంస్థ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు 450K కి పైగా Mi టివిలు మరియు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఉత్పత్తులను విక్రయించింది. ఇందులో 50 మరియు 55-అంగుళాల పెద్ద స్క్రీన్ పరిమాణాల టీవీలు 50 శాతం వరకు వృద్ధిని సాధించాయి. Mi వాచ్ రివాల్వ్ మరియు Mi స్మార్ట్ స్పీకర్ వినియోగదారులకు అగ్రస్థానంలో ఉండగా, Mi బాక్స్ 4K మరియు Mi టివి స్టిక్ వంటివి అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లలో అత్యధికంగా అమ్ముడైన స్ట్రీమింగ్ పరికరాలుగా ప్రస్తుతానికి ముందంజలో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Xiaomi Fake Products Seized in Bengaluru and Chennai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X