5.7 అంగుళాల డిస్ప్లేతో షియోమీ ఎమ్ఐ నోట్
ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ షియోమీ, ‘ఎంఐ నోట్' పేరుతో తన సరికొత్త ఫ్లాగ్షిప్ మోడల్ ఫోన్ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. తమ ‘ఎంఐ నోట్' ఫోన్ను ఈ ఏడాదికిగాను అత్యుత్తమ డివైస్గా షియోమీ అభివర్ణించింది.
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్డేట్స్ పొందండి

షియోమీ ఎమ్ఐ నోట్ స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే...
ఫోన్ మందం 6.95 మిల్లీ మీటర్లు, బరువు 161 గ్రాములు, పొడవు 155.1 మిల్లీ మీటర్లు, వెడల్పు 77.6 మిల్లీ మీటర్లు, 5.7 అంగుళాల డిస్ప్లే, 2.5డీ గొరిల్లా గ్లాస్ 3, 1080 పిక్సల్ డిస్ప్లే రిసల్యూషన్, 386 పీపీఐ.
క్వాడ్కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 801 చిప్ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.5గిగాహెర్ట్జ్),
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ 4జీ కాలింగ్ (నానో సిమ్ + మైక్రో సిమ్),
24బిట్/191KHz లాస్లెస్ ఆడియో సపోర్ట్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా ( సోనీ ఐఎమ్ఎక్స్ 214 సెన్సార్, ఆప్టికల్ స్టెబిలైజేషన్, ఫిలిప్స్ టూ టోన్ ఫ్లాష్),
4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ సోనీ/ఎల్జీ ఎల్ఐ-పో బ్యాటరీ.
మార్కెట్లో షియోమీ ఎమ్ఐ నోట్ జనవరి 27 నుంచి లభ్యమవుతుంది. ధరలు ఇలా ఉండొచ్చు. 16జీబి వేరియంట్ ధర ¥2299 (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.22,917), 64జీబి వేరియంట్ ధర ¥2799 (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.27,901).


Click it and Unblock the Notifications








