Just In
- 3 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 5 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 5 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 7 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇక తిరుపతిలోనే స్మార్ట్ టీవీల తయారీ, కొత్త యూనిట్ను స్టార్ట్ చేసిన Xiaomi
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi), తన సరికొత్త స్మార్ట్ టీవీ అసెంబ్లింగ్ యూనిట్ను తిరుపతిలో ప్రారంభించింది.
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమి (Xiaomi), తన సరికొత్త స్మార్ట్ టీవీ అసెంబ్లింగ్ యూనిట్ను తిరుపతిలో ప్రారంభించింది. ఈ కొత్త ప్రొడక్షన్ లైన్ను డిక్సన్ టెక్నాలజీస్తో కలిసి షియోమి ముందుకు నడిపించబోతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 7 ప్రొడక్షన్ లైన్లను నెలకొల్పిన షియోమి, తాజాగా ఎనిమిదవ యూనిట్ను తిరుపుతిలో ఏర్పాటు చేసింది.
6 యూనిట్లు ప్రత్యేకించి స్మార్ట్ఫోన్ల కోసమే..
ఈ 8 యూనిట్లలో 6 యూనిట్లు ప్రత్యేకించి స్మార్ట్ఫోన్లను మాత్రమే అసెంబుల్ చేస్తాయి. ఒక యూనిట్ మాత్రం పవర్ బ్యాంక్లను అసెంబుల్ చేస్తుంది. మరో యూనిట్ ప్రత్యేకించి స్మార్ట్ టీవీలను మాత్రమే అసెంబుల్ చేస్తుంది. ఈ ప్రొడక్షన్ లైన్లను ఫాక్స్కాన్, హైప్యాడ్ టెక్నాలజీస్, డిక్సట్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో షావోమి నడిపిస్తోంది. ఈ ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్ (శ్రీసిటీ), తమిళనాడు (శ్రిపెరంబుదూర్), ఉత్తర్ప్రదేశ్ (నోయిడా)లలో ఏర్పాటై ఏన్నాయి.
జనవరి నాటికి నెలకు లక్ష టీవీల తయారీ..
నూతనంగా ఏర్పాటు చేసిన తిరుపతి యూనిట్లో స్మార్ట్ టీవీ ప్రొడక్షన్ ప్రాసెస్ నిధానంగా పందుకుంటుందుని, వచ్చే జనవరి -మార్చి క్వార్టర్ నాటికి నెలకు లక్ష టీవీలను అసెంబుల్ చేసే దిశగా వర్క్ ఫోర్సును సమకూర్చుకుంటామని షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జెయిన్ తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటు కాక ముందు టీవీలను చైనా నుంచి దిగుమతి చేసుకోవల్సి వచ్చేదని, ఇప్పుడు కాంపోనెంట్స్ మాత్రమే దిగుమతి చేసుకుంటే సరిపోతుందని ఆయన తెలిపారు.
నెం.1 స్మార్ట్ టీవీ బ్రాండ్గా షియోమి ..
ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లో మొదటి స్థానాన్ని సెక్యూర్ చేసుకున్న షియోమి, ఆ స్థానాన్ని పదిలపరుచుకునే ప్రాసెస్లో లోకల్ అసెంబ్లింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. షియోమి స్మార్ట్ టీవీలు, 2018 మొదటి క్వార్టర్లో భారత్లో లాంచ్ అయ్యాయి. వీటికి ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిపోవటంతో రెండవ క్వార్టర్ నాటికి అమ్మకాలు మూడు రెట్లకు ఎగబాకాయి. దీంతో భారతదేశపు నెం.1 స్మార్ట్ టీవీ బ్రాండ్గా షియోమి రికార్డ్ సృష్టించింది.
ఇప్పటి వరకు 5 లక్షల టీవీ విక్రయాలు..
స్మార్ట్ఫోన్ల విభాగంలో ఇప్పటికే నెం.1 బ్రాండ్గా కొనసాగుతోన్న షియోమి తన పరిధిని ఇతర విభాగాలకు విస్తరించుకోవాలని చూస్తోంది. షియోమి తన మొదటి స్మార్ట్ టీవీని ఫిబ్రవరి, 2018లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీని ప్రపంచపు అతిపలచటి ఎల్ఈడి టీవీగా షావోమి అభివర్ణించింది. తన మొదటి స్మార్ట్ టీవీని మార్కెట్లో లాంచ్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల టీవీలను మార్కెట్లో విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.
30 నుంచి 40 క్యాటగిరీలకు ప్రొడక్ట్ రేంజ్..
షియోమి స్మార్ట్ టీవీలు మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న సామ్సంగ్, సోనీ ఇంకా ఎల్జీ స్మార్ట్ టీవీలను గట్టిపోటీ ఎదురైనట్లయ్యింది. షియోమి తన స్మార్ట్ టీవీలను రూ.13,999 నుంచి రూ.49,999 మధ్య విక్రయిస్తోంది. భారత్లో షియోమి తన ప్రొడక్ట్ రేంజ్ను 30 నుంచి 40 క్యాటగిరీలకు విస్తరించింది. వాటిలో ఫోన్లు, టీవీలు, ఫిట్నెస్ డివైసెస్, పవర్ బ్యాంక్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్, స్మార్ట్ రౌటర్స్ ఇంకా పలు ఆడియో ప్రొడక్ట్స్ ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470