'Diwali with Mi' సేల్ షురూ.. Xiaomi ఉత్పత్తులపై భారీ ఆఫర్లు!
భారత్లో పండగ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ Xiaomi, దీపావళి సేల్ను ప్రారంభించింది. 'Diwali with Mi' పేరుతో 7వ ఎడిషన్ పండుగ సీజన్ సేల్ ప్రారంభం చేసింది. తన అధికారిక వెబ్సైట్ mi.comలో పండుగ సీజన్ విక్రయాలను ప్రారంభించింది. ఈ సేల్లో 30కి పైగా స్మార్ట్ఫోన్లు, 25కి పైగా టీవీలు & ల్యాప్టాప్లు మరియు 80కి పైగా Xiaomi ఎకోసిస్టమ్ ఉత్పత్తులపై ఆఫర్లను అందిస్తోంది.

ఈ ప్రత్యేక సేల్ కొనసాగుతున్న సందర్భంగా.. మీకు బెస్ట్ ఆఫర్లను కనుక్కోవడానికి ఇబ్బంది పడకుండా.. మేం మీకోసం Xiaomi మరియు Redmi ఉత్పత్తుల్లో అత్యుత్తమ డీల్లు కలిగిన వాటి జాబితాను రూపొందించాము. ఏదేమైనప్పటికీ.. షియోమీ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు దీటుగా ఈ సేల్లో ఆఫర్లను అందిస్తోంది. మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి. ఆఫర్లను సొంతం చేసుకోండి.

Xiaomi స్మార్ట్ఫోన్లపై 'Diwali With Mi' సేల్ ఆఫర్లు:
* Xiaomi 12 Pro మొబైల్ గత ఏప్రిల్లో ఇది భారత మార్కెట్లో విడుదలైంది. లాంచ్ సమయంలో దీని (8/256GB) వేరియంట్ ధరను రూ.62,999 గా కంపెనీ నిర్ణయించింది. అయితే, ఇప్పుడు ఇది 'Diwali With Mi' సేల్లో భాగంగా రూ.45,999 కే అందుబాటులో ఉండనుంది.
* Xiaomi 11T ప్రో మొబైల్ యొక్క (8/128GB) వేరియంట్ రూ.11,500 తగ్గింపుతో, రూ.28,499 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంది.
* Xiaomi 11i హైపర్ఛార్జ్ మొబైల్పై కూడా మంచి డీల్ లభిస్తోంది. 11i హైపర్ఛార్జ్ (6/128GB) వేరియంట్ సాధారణ విక్రయ ధర రూ.19,749, కాగా ఇది ఇప్పుడు మీకు రూ.18,749 అందుబాటులో ఉంది.
Redmi స్మార్ట్ఫోన్లపై 'Diwali With Mi' సేల్ ఆఫర్లు:
* Redmi K50i యొక్క 6/128GB మోడల్ ధర రూ.19,999కు అందుబాటులో ఉంటుంది. మరియు 8/256GB మోడల్ రూ.22,999 కు అందుబాటులో ఉంటుంది.
* Redmi Note 11 Pro సిరీస్కు చెందిన Note 11 Pro+ 5G పై కూడా మంచి డిస్కౌంట్లు లభించనున్నాయి. ఈ మోడల్ మొబైల్స్ పై దాదాపు రూ.4,250 డిస్కౌంట్లు లభించనున్నాయి. 6/128GB వేరియంట్ మోడల్ను రూ.16,749, మరియు 8/256GB వేరియంట్ ను ధర రూ.19,999 కు కొనుగోలు చేయవచ్చు. ప్రామాణిక Redmi Note 11 Pro మోడల్ (6/128GB) ధర రూ.1,500 తగ్గింపు తర్వాత రూ,16,499 అందుబాటులో ఉంటుంది. ఇంకా సేల్లో ఉన్న పలు రెడ్మి స్మార్ట్ఫోన్ లు మంచి ఆఫర్లు కలిగి ఉన్నాయి. జాబితా కోసం సైట్ను సందర్శించవచ్చు.

స్మార్ట్టీవీలపై 'Diwali With Mi' సేల్ ఆఫర్లు:
* Xiaomi Smart TV 5X 43"- 43-అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్ ధర రూ.31,999గా నిర్ణయించారు. కానీ, ప్రస్తుతం దీన్ని దీపావళి సేల్లో భాగంగా రూ.25,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.
* Xiaomi Smart TV 5A స్మార్ట్టీవీ 32-అంగుళాల మోడల్ లాంచ్ ధర రూ.15,499 గా నిర్ణయించారు. దీన్ని మీరు రూ.9,899కు కొనుగోలు చేయవచ్చు.
Xiaomi ల్యాప్టాప్/టాబ్లెట్లు & ఎకోసిస్టమ్ ఉత్పత్తులపై కూడా గొప్ప డీల్స్:
* RedmiBook 15 (15.6", i3, 8/256GB)- సేల్ ధర- రూ.28,999 (తగ్గింపు- రూ.6,000)
* RedmiBook 15 Pro (i12, 8GB ధర) సేల్ ధర రూ.35,999 (తగ్గింపు- రూ.11,000)
* Mi నోట్బుక్ ప్రో i5 (16/512GB) సేల్ ధర- రూ.52,999 (తగ్గింపు- రూ.7,000)
* Xiaomi ప్యాడ్ 5 (6/128GB) సేల్ ధర- రూ.22,999 - (తగ్గింపు రూ. 4,000)
Xiaomi ఇండియా 2022 పండుగ సీజన్ సేల్ సందర్భంగా mi.comలో డిస్కౌంట్లను అందించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్ మరియు ఇండస్ఇండ్ బ్యాంక్తో భాగస్వామ్యం కలిగి ఉంది. మీరు Paytm, ZestMoney, OlaMoneyని ఉపయోగిస్తే కూడా Xiaomi ఉత్పత్తులపై తగ్గింపులను పొందవచ్చు. లేదా mi.comలో కొనుగోలు చేయడానికి బజాజ్ ఫైనాన్స్ కూడా ఉపయోగించవచ్చు.


Click it and Unblock the Notifications








