Just In
- 1 hr ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 3 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- News
షార్ట్కట్స్ వద్దు! ‘యావరేజ్’ అద్భుతాలు సృష్టిస్తుంది: పరీక్షాపే చర్చలో ప్రధాని మోడీ
- Movies
తారక రత్నకు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స..
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఈ రోజు నుంచి పేటీఎమ్ Mobikwik పనిచేయవు, ఎందుకో తెలుసా..?
మీరు పేటీఎమ్, Mobikwikలో లావాదేవీలు జరుపుతున్నారా..అయితే అవి పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుని లావాదేవీల కోసం ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే ఆర్బిఐ కఠిన రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఫుల్ కేవైసీ(నో యువర్ కస్టమర్) విధివిధానాలను పూర్తి చేసయని కస్టమర్లకు లావాదేవీలుజరిపే అవకాశం లేదని చెబుతోంది. కేవలం ఫుల్ కేవైసీ(నో యువర్ కస్టమర్) విధివిధానాలను పూర్తి చేసిన కస్టమర్లకు మాత్రమే ఇది సాధ్యపడుతుందట. నేటి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విధించిన కేవైసీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో వాలెట్ యూజర్లు తమ లావాదేవీలపై ఆర్బీఐ విధించే పలు నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 28 వరకు..
ఫిబ్రవరి 28 వరకు వాలెట్ యూజర్ల నుంచి కేవైసీ వివరాలను పొందాలని డిజిటల్ వాలెట్ కంపెనీలకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. కాగా ఈ గడువును మరింతగా పొడిగించాలని డిజిటల్ వాలెట్ కంపెనీలు కోరాయి.

కంపెనీల ప్రతిపాదనను
కానీ కంపెనీల ప్రతిపాదనను ఆర్బీఐ తోసిపుచ్చింది. మరోసారి తుది గడువును పొడిగించేది లేదంటూ తేల్చిచెప్పింది. ప్రస్తుతం నిన్నటితో ఆ గడువు ముగియడంతో, కేవైసీ వివరాలను సమర్పించని కస్టమర్లను వాలెట్ ప్రొవైడర్లు కోల్పోతున్నారు.

ఫుల్ కేవైసీ వివరాలు లేకుండా..
అయితే ఫుల్ కేవైసీ వివరాలు లేకుండా 10 వేల రూపాయల వరకు ఆపరేట్ చేసుకునేలా డిజిటల్ వాలెట్లకు అనుమతి ఇవ్వాలంటూ ఇండస్ట్రి బాడీ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రిజర్వు బ్యాంకును కోరుతోంది. కానీ ప్రతి పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కేవైసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిదేనంటూ ఆర్బీఐ స్పష్టం చేసింది.

ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను..
ఆర్బీఐ నిబంధనలు ప్రకారం, ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను వాలెట్ ప్రొవైడర్లకు సమర్పించిన కస్టమర్లు, తాజాగా ఫండ్స్ను తమ వాలెట్లలోకి వేసుకోవడం కుదరదు. అంతేకాక ఇతర వాలెట్లకు ఫండ్స్ ట్రాన్సఫర్ చేయలేరు. అయితే వాలెట్లో ఉన్న ఫండ్స్ను కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు.

వాలెట్ నగదును కోల్పోకుండా
వాలెట్ నగదును కోల్పోకుండా.. వాటిని బ్యాంకులకు ట్రాన్సఫర్ చేసుకునేలా కూడా ఆర్బీఐ వీలు కల్పించింది. ప్రీపెయిడ్ వాలెట్ సర్వీసులను వినియోగిస్తున్న 90 శాతం కస్టమర్లు ఇప్పటి వరకు కేవైసీ వివరాలను వాలెట్ ప్రొవైడర్లకు సమర్పించలేదు. దీంతో నేటి నుంచి వీరిపై వాలెట్ల వాడక నిషేధం పడబోతుంది. ఈ చర్యలతో వాలెట్ ప్రొవైడర్లు భారీగా కస్టమర్లు కోల్పోనున్నారు.

చ్చే కొన్ని నెలల్లో..
ఈ నిబంధనలతో వచ్చే కొన్ని నెలల్లో కస్టమర్ల కూడా భారీగా ప్రభావితం కానున్నారని ది మొబైల్ వాలెట్ ఫౌండర్ వినయ్ కలాంత్రి అన్నారు. అయితే ఇది దీర్ఘకాలానికి మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పారు. క్వాలిటీ కస్టమర్లను వాలెట్లు పొందుతాయన్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470