బెలూన్లో అంతరిక్ష యాత్ర, చైనా సన్నాహాలు
చైనాకు చెందిన ప్రముఖ స్పేస్ టెక్నాలజీ సంస్థ JHY స్పేస్ టెక్నాలజీస్ దేశంలోనే మొట్టమొదటి స్పేస్ పారాచూట్ సూట్ ను అభివృద్థి చేసింది. ఈ హైటెక్ బెలూన్ల ద్వారా ఔత్సాహికులను అంతరిక్షంలోకి పంపి పారాచూట్ ల ద్వారా వారిని సురక్షితంగా క్రిందకు దింపవచ్చని సంస్థ చెబుతోంది. ఈ పారాచూట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి రావాలంటే దాదాపు 77,000 డాలర్లు ఖర్చవుతుందట.

చైనా ఇప్పుడు చంద్రమండలం అవతలి వైపును పరిశోధించేందుకు సిద్ధమైంది. భూమికి కనిపించని చందమామ అవతలివైపు భౌగోళిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలను పరిశోధించడానికి చేపట్టిన ప్రాజెక్టును 2020 సంవత్సరాని కంటే ముందే పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు.దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం...
Read More : పాత ఫోన్ ఇస్తే కొత్త మోటరోలా ఫోన్

చంద్రుడి పై కన్నేసిన చైనా
చందమామను మనం ఓ పక్కనే చూస్తున్నాం. చంద్రుడికి అవతలి పక్కన ఏముందోననే సందేహం చాలా సంవత్సరాలుగా మనల్నే కాదు పరిశోధకులను కూడా వెంటాడుతోంది.

చంద్రుడి పై కన్నేసిన చైనా
చంద్రుడి గురించి ప్రపంచానికి తెలియని వాస్తవాలను ఆవిష్కరించేందేకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా పరిశోధనలను కూడా ముమ్మరం చేసింది.

చంద్రుడి పై కన్నేసిన చైనా
చంద్రగ్రహానికి మరోపక్క భాగంలో భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపై పరిశోధనలు చేయడానికి చాంగ్ ఈ-4 ప్రాజెక్ట్ను 2020లోగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని తగిన ఏర్పాట్లు చేస్తున్నదని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన పరిశోధకుడు జో యాంగ్లియావో తెలిపారు.

చంద్రుడి పై కన్నేసిన చైనా
రష్యా అమెరికాల తర్వాత చాంగ్ఏ-3 మిషన్తో చంద్రుడిపై అడుగుపెట్టిన మూడో దేశంగా చైనా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

చంద్రుడి పై కన్నేసిన చైనా
ఈ పరిశోధన కోసం ఎక్కువ పని ఒత్తిడిని తట్టుకోగలిగే చాంగ్ ఈ -4 మిషన్ను చైనా సిద్ధం చేస్తోెంది.

చంద్రుడి పై కన్నేసిన చైనా
గురుత్వాకర్షణ కారణంగా చంద్రుడికి మరోవైపు ఉన్న ప్రాంతం భూమిపై ఉన్నవారికి కనిపించదు.


Click it and Unblock the Notifications








