Just In
- 2 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 7 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 9 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- News
ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా: కేసీఆర్తో కేజ్రీవాల్ దోస్తీనే కారణం!
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Movies
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
అంతరిక్షం లో 7 రోజులు గడపనున్న భారత వ్యోమగాములు ! గగన్ యాన్ లాంచ్ ఎప్పుడు ?
2023లో గగన్యాన్ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ గగన్ యాన్ మిషన్ ద్వారా భారతీయుల ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మిషన్ ద్వారా త్వరలో అంతరిక్షంలో భారతదేశం చరిత్ర సృష్టించబోతోంది. వచ్చే ఏడాది అంటే 2023 లో గగన్యాన్ మిషన్ను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఈ మిషన్లో మనుషులన అంతరిక్షంలోకి పంపనున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి ఈ మిషన్కు సంబంధించి రెండు ట్రయల్స్ జరుగుతాయని, ఆ తర్వాత వచ్చే ఏడాది ఒకరిద్దరు భారతీయులను అంతరిక్షంలోకి పంపుతామని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెబుతున్నారు.

ఈ ట్రయల్స్ ఎలా జరుగుతాయి?
గగన్యాన్ మిషన్ గురించి సవివరమైన సమాచారం తెలియచేస్తూ, మొదటి ట్రయల్ మానవ రహితంగా ఉంటుందని డాక్టర్ సింగ్ చెప్పారు. దీని తర్వాత రెండో ట్రయల్లో వ్యోమిత్ర అనే మహిళా రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ రోబోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసింది. ఈ రెండు ట్రయల్స్ 2022 చివరి నాటికి పూర్తి చేయబడతాయి. ఈ మిషన్ విజయవంతమైన తర్వాత మాత్రమే, మూడవసారి మానవులను అంతరిక్షంలోకి పంపడానికి సన్నాహాలు చేయబడతాయి అని విమరించారు.

ఈ గగన్ యాన్ మిషన్ కోసం ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణ ఇచ్చారు
డాక్టర్ సింగ్ ప్రకారం, మూడవ మిషన్ లో అంతరిక్ష విమానంలో ఇద్దరు వ్యక్తులను పంపవచ్చు.వీరు 7 రోజులుపాటు అంతరిక్షంలో ఉంటారు. ఈ మిషన్ కోసం, భారత వైమానిక దళానికి చెందిన నలుగురు పైలట్లను రష్యాకు పంపారు మరియు అంతరిక్ష శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఈ వ్యోమగాములను 'గగనాట్స్' అనే పేరుతో పిలుస్తారు.

నలుగురు పైలట్లు
భారత వైమానిక దళానికి చెందిన నలుగురు పైలట్లలో ఒకరు గ్రూప్ కెప్టెన్. మిగిలిన ముగ్గురు వింగ్ కమాండర్లు ఉన్నారు. వీరు గగన్యాన్ మిషన్కు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బెంగళూరులోని గగన్యాన్ మాడ్యూల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.

గగన్యాన్ మిషన్ కోసం 10 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు
గగన్యాన్ మిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ 15 ఆగస్టు 2018న ఎర్రకోట వేదిక నుండి ప్రకటించారు. దాదాపు 10 వేల కోట్ల రూపాయలు మిషన్కు వెచ్చించనున్నారు అని అప్పుడు ప్రకటించారు. ఇందుకోసం 2018లోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత వ్యోమగాములు భూమి యొక్క దిగువ కక్ష్యను 7 రోజుల పాటు చుట్టి రానున్నారు.ఈ వ్యోమగాముల శిక్షణ కోసం, ఇస్రో రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ గ్లావ్కోస్మోస్తో జతకట్టింది.

ISRO కి ఈ మిషన్ చాలా ముఖ్యమైనది
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ కి ఈ మిషన్ చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు రష్యా ,అమెరికా ,చైనా వంటి దేశాలు ఈ manned space flight ను లాంచ్ చేసారు . ఈ ప్రయోగాన్ని ISRO సక్సెస్ చేస్తే ఇండియా నాలుగవ దేశం గా కీర్తింపబడుతుంది.

హుమానాయిడ్ రోబో
గగన్ యాన్ ట్రయల్స్ లో భాగంగా హుమానాయిడ్ రోబో ను అంతరిక్షం లోకి పంపనున్నట్లు మనము తెలుసుకున్నాం. ఇప్పడు ఈ రోబో యొక్క , పని సామర్త్యాన్ని పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) గగన్యాన్ ప్రయోగంతో రోదసీలోకి మనుషుల్ని పంపేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా మనుషులతో పాటుగా హ్యూమనాయిడ్ రోబోను కూడా అంతరిక్షంలోకి పంపాలని చూస్తున్నది. వ్యోమమిత్ర పేరు గల ఈ రోబో మనుషులు చేయగల అన్ని రకాల పనులను చేయగలదు. ఇది ఎవరైనా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వగలదు ఆ వివరాలు చూడండి.

పేరు " వ్యోమమిత్ర ".
ఇస్రో తయారుచేసిన రోబోకి శాస్త్రవేత్తలు పెట్టుకున్న పేరు " వ్యోమమిత్ర ". గగనయాన్ ప్రాజెక్టు ద్వారా రోదసీ లోకి మనుషులతో పాటుగా ఈ రోబోను పంపుతున్నారు. ఇది మనుషుల్లా మాట్లాడే, ఆలోచించే, పనిచేసే రోబో. ఇది వ్యోమగాములతోనే ఉంటూ వాళ్ల ఆరోగ్యాన్ని తెలుసుకొని ఇస్రోకు సమాచారం అందిస్తుంది. ఈ రోబోలో గల ప్లస్ పాయింట్ ఇది చక్కగా మాట్లాడగలదు మరియు ఎవరైనా ప్రశ్నించగానే దానికి తగ్గ ఆన్సర్ ఇవ్వగలదు. అందువల్ల ఎప్పటికప్పుడు దీనితో మాట్లాడుతూ రోదసీ ప్రయాణం ఎలా సాగుతుందో శాస్త్రవేత్తలు తెలుసుకోవచ్చు.

వ్యోమమిత్ర ను పరీక్షించినప్పుడు ఈ రోబో పలికిన వ్యాఖ్యలు
సందర్శకుల కోసం ఒక కార్యక్రమంలో గగన్యాన్ మిషన్ కోసం తయారు చేయబడిన మొట్టమొదటి మానవరహిత హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్ర తనను తాను పరిచయం చేసుకుంది. "అందరికీ నమస్తే.. నేను వ్యోమమిత్ర. మానవరహిత గగన్యాన్ మిషన్ కోసం తయారుచేసిన మొదటి హ్యూమనాయిడ్ రోబోను నేను. నేను కొన్ని మాడ్యూల్ పారామితులను పర్యవేక్షించగలను మరియు మిమ్మల్ని అప్రమత్తం చేయగలను అంతేకాకుండా వివిధ రకాల కార్యకలాపాలలోను సహాయం చేయగలను" అని రోబోట్ మాట్లాడింది.

GSLV Mark-III
1984 లో రాకేశ్ శర్మ రష్యన్ మాడ్యూల్లో అంతరిక్షం లోకి ప్రయాణించారు. అయితే ఈసారి భారత వ్యోమగాములు భారతదేశం నుండి తమ సొంత భారతీయ మాడ్యూల్లో ప్రయాణిస్తారు అని కేంద్ర మంత్రి విలేకరులతో అన్నారు. ఇస్రో వర్గాల సమాచారం ప్రకారం భారతదేశపు భారీ ప్రయోగ వాహనం GSLV Mark-III ఈ మిషన్ లో వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళుతుంది అని తెలుస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470