పాక్, చైనాలకు మూడింది, ఇండియన్ ఆర్మీలోకి రోబో సైన్యం
సైనికులకు అండగా రోబో సైన్యం త్వరలో భారత ఆర్మీలోకి రానుంది
పుణ్యభూమిగా పేరొందిన భారతదేశపు సరిహద్దుల్లో రోజు నెత్తుటేరులు పారుతూనే ఉన్నాయి. దేశ వినాశనం కోసం పొరుగుదేశాలు అనేక రకాలైన కుయుక్తులకు తెరలేపుతూనే ఉన్నాయి. మన సైనికులు ప్రాణాలకు తెగించి నిత్యం వారితో పోరాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సైనికులకు అండగా రోబో సైన్యం త్వరలో భారత ఆర్మీలోకి రానుంది. శత్రువుల ఆటకట్టించేందుకు కేంద్రం సరికొత్తగా ముందుకెళుతోంది.

ఉగ్రవాదుల విధ్వంసాలను
ఉగ్రవాదుల విధ్వంసాలను అదుపు చేసే సమయంలో సైనికులకు ఎదురవుతున్న కష్టాలను తగ్గించేందుకు భారత సైన్యం ఈ రోబోటిక్ వెపన్స్ ను వాడనుంది.

తమకు 544 రోబోలు అవసరమంటూ
తమకు 544 రోబోలు అవసరమంటూ సైనికాధికారులు పంపిన ప్రతిపాదనకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది.

డీఆర్డీవో గత ఎనిమిది నెలలుగా
డీఆర్డీవో గత ఎనిమిది నెలలుగా ఈ ప్రాజెక్టుపై వర్క్ కూడా చేస్తోంది. అన్నీ కుదిరితే త్వరలో ఈ రోబోలు మన సైన్యానికి సేవలు అందించనున్నాయి.

మేక్" కేటగిరీ కింద 2016 లోనే
మేక్" కేటగిరీ కింద 2016 లోనే దీనికి సంబంధించిన ప్రక్రియను సైన్యం ప్రోద్భలంతో ప్రారంభించారు.

జమ్ము కాశ్మీర్లో ఎదురవుతున్న
జమ్ము కాశ్మీర్లో ఎదురవుతున్న పరిస్థితి సాధారణమైంది కాదు. రాష్ట్రీయ రైఫిల్స్కు సున్నితమైన ప్రాంతాల్లో ముప్పు ఎదురవుతోంది" అని సైన్యం తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం మొదటి యూనిట్ తో పాటే రెండో యూనిట్ ను కూడా రిమోట్ తో ఒకే ఆపరేటర్ నిర్వహిస్తాడు.

రెండు "డిస్-ప్లే స్క్రీన్" లను
ఈ రిమోట్కు రెండు "డిస్-ప్లే స్క్రీన్" లను కలిగిఉంటాయి. తక్కువ బరువుండే ఈ రోబోలకు నిఘా కెమెరాలు కూడా అమరుస్తారు.

200 మీటర్ల దూరం వరకూ
200 మీటర్ల దూరం వరకూ కెమెరా లు స్పష్టమైన చిత్రాలను తీయగలుగుతాయి. ఐఈడి పేలుడు పదార్థాలను గుర్తించేందుకు రిమోట్ తో ఆపరేట్ చేసే వాహనాన్ని ఇటీవలే సైన్యంలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

నిఘా, భద్రత కార్యకలాపాల నిర్వహణకు
అదీకాక ఉగ్రవాదులు ప్రస్తుతం అడవుల నుంచి పట్టణ ప్రాంతాలకు వస్తుండటంతో నిఘా, భద్రత కార్యకలాపాల నిర్వహణకు రోబోలను వినియోగించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.


Click it and Unblock the Notifications








