నిప్పులు చిమ్ముతూ నింగిలోకి జీశాట్ -11,ఇస్రో ఖాతాలో మరో విజయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ సేవలను అందజేయడం సహా కొత్తతరం అప్లికేషన్ల రూపకల్పనకు వేదికగా నిలవగలదని భావిస్తున్న సమాచార ఉపగ్రహం జీశాట్-11ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భారత దేశ అతిపెద్ద బరువున్న ఉపగ్రహం జీశాట్ -11ను ఇస్రో అధికారులు విజయవంతంగా కక్ష్యలోకి పంపారు. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రంలో భారత కాలమానం ప్రకారం… తెల్లవారుజామున 2.08 నుంచి 3.23 గంటల మధ్య ఈ ప్రయోగం చేపట్టారు. భారత్ కొనుగోలు చేసిన ఫ్రెంచ్ ఏరియేన్ -5 రాకెట్ ద్వారా జీశాట్ -11ను ఇస్రో అధికారులు కక్ష్యలోకి పంపారు.

రూ. 600కోట్లు ఖర్చు
బిగ్ బర్డ్గా పిలుచుకునే ఈ ఉపగ్రహం తయారీకీ రూ. 600కోట్లు ఖర్చు చేసినట్లు ఇస్రో అధ్యక్షుడు డాక్టర్. కె.శివన్ తెలిపారు. గత మే 25నే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినా విఫలమైంది. ఇప్పుడు ఇది అదనపు సాంకేతిక హంగులతో రూపుదిద్దుకుని నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

5,848 కిలోల బరువు
5,848 కిలోల బరువున్న జీ శాట్ -11 ఇప్పటివరకు భారత్ తయారు చేసిన ఉపగ్రహాలన్నింటికన్నాచాలా బరువైంది. దీన్ని అరియాన్ -5 రాకెట్ సాయంతో ఫ్రెంచ్ గయానానుంచి ప్రయోగించారు.

15 ఏళ్ల పాటు సేవలు
ఈ ఉపగ్రహంలో దేశ సమాచర వ్యవస్త కోసం 32 కేయీ బాండ్తో పాటు 8 కేఏ బాండ్ ట్రాన్స్ ఫాండర్లను ఏర్పాటు చేశారు. జీశాట్ -11 ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందింస్తుంది. దేశంలోని గ్రామ పంచాయితీలకు ఈ - గవర్నెన్స్కు జీశాట్ -11 పంపే సమాచారం ఉపయోగపడుతుంది.

న్యూ జనరేషన్ అప్లికేషన్ల రూపకల్పనకు మార్గం సుగమం
జీశాట్ - 11 ద్వారా దేశవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింతగా విస్తరించనున్నాయి. అంతేకాదు న్యూ జనరేషన్ అప్లికేషన్ల రూపకల్పనకు మార్గం సుగమం కానుంది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా స్పేస్ సెంటర్ నుంచి ఏరియన్ - 5 రాకెట్ ద్వారా జీశాట్ - 11 ను ఇస్రో గగనతలంలోకి పంపించింది.

నాలుగు జీశాట్ -11 ప్రయోగాల్లో ఇది మూడోది
డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా సెకనుకు 100 జీబీ డాటా అందించేలా ఇస్రో ప్రయోగిస్తున్న నాలుగు జీశాట్ -11 ప్రయోగాల్లో ఇది మూడోది.

5,854 కిలోల పరిమాణం
33 నిమిషాల పాటు ప్రయాణించిన ఏరియన్ - 5 రాకెట్.. జీశాట్ - 11 ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 5,854 కిలోల పరిమాణంలో ఉన్న ఈ ఉపగ్రహం పదిహేనేళ్ల పాటు సేవలు అందించనుంది.

అంతరిక్ష ఆస్తి
సమాచార వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లనున్న జీశాట్ - 11 ఉపగ్రహం మనదేశానికి విలువైన అంతరిక్ష ఆస్తిగా అభివర్ణించారు ఇస్రో ఛైర్మన్ కె.శివన్.


Click it and Unblock the Notifications








