Gaganyaan మిషన్ లో హ్యూమనాయిడ్ రోబో.... ఇస్రో సంచలన నిర్ణయం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) గగన్యాన్ ప్రయోగంతో 2022లో రోదసీలోకి మనుషుల్ని పంపేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా మనుషులతో పాటుగా హ్యూమనాయిడ్ రోబోను కూడా అంతరిక్షంలోకి పంపాలని చూస్తున్నది. వ్యోమమిత్ర పేరు గల ఈ రోబో మనుషులు చేయగల అన్ని రకాల పనులను చేయగలదు. ఇది ఎవరైనా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వగలదు.

ఇస్రో తయారుచేసిన రోబోకి శాస్త్రవేత్తలు పెట్టుకున్న క్యూట్ నేమ్ వ్యోమమిత్ర. గగనయాన్ ప్రాజెక్టు ద్వారా 2022లో రోదసీ లోకి మనుషులతో పాటుగా ఈ రోబోను పంపుతున్నారు. ఇది మనుషుల్లా మాట్లాడే, ఆలోచించే, పనిచేసే రోబో. ఇది వ్యోమగాములతోనే ఉంటూ వాళ్ల ఆరోగ్యాన్ని తెలుసుకొని ఇస్రోకు సమాచారం అందిస్తుంది. ఈ రోబోలో గల ప్లస్ పాయింట్ చక్కగా మాట్లాడగలదు మరియు ఎవరైనా ప్రశ్నించగానే దానికి తగ్గ ఆన్సర్ ఇవ్వగలదు. అందువల్ల ఎప్పటికప్పుడు దీనితో మాట్లాడుతూ రోదసీ ప్రయాణం ఎలా సాగుతుందో శాస్త్రవేత్తలు తెలుసుకోవచ్చు.
In the run up to the first Human Space Mission by India at @isro ... 'Vyommitra', the humanoid for #Gaganyaan unveiled. This prototype of humanoid will go as trial before Gaganyaan goes with Astronauts. #ISRO pic.twitter.com/pnzklgSfqu
— Dr Jitendra Singh (@DrJitendraSingh) January 22, 2020
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ "వ్యోమమిత్ర" హ్యూమనాయిడ్ రోబోకు సంబందించిన 31 సెకన్ల వీడియోను ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. @ ఇస్రోలో ఇండియా చేసిన మొట్టమొదటి హ్యూమన్ స్పేస్ మిషన్ ... రన్-అప్ ... వ్యోమిత్రా, # గగన్యాన్ కోసం హ్యూమనాయిడ్ ఆవిష్కరించబడింది అనే పేరుతో ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో గొప్ప సంచలం సృష్టిస్తున్నది.

వ్యోమమిత్ర వ్యాఖ్యలు
సందర్శకుల కోసం ఒక కార్యక్రమంలో గగన్యాన్ మిషన్ కోసం తయారు చేయబడిన మొట్టమొదటి మానవరహిత హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్ర తనను తాను పరిచయం చేసుకుంది. "అందరికీ నమస్తే.. నేను వ్యోమమిత్ర. మానవరహిత గగన్యాన్ మిషన్ కోసం తయారుచేసిన మొదటి హ్యూమనాయిడ్ రోబోను నేను. నేను కొన్ని మాడ్యూల్ పారామితులను పర్యవేక్షించగలను మరియు మిమ్మల్ని అప్రమత్తం చేయగలను అంతేకాకుండా వివిధ రకాల కార్యకలాపాలలోను సహాయం చేయగలను అని రోబోట్ అందంగా పలికింది.

గగన్యాన్ మిషన్
గగన్యాన్ మిషన్ కోసం వెళ్లే నలుగురు వ్యోమగాములు ఈ నెల చివరి నాటికి శిక్షణ కోసం రష్యాకు వెళ్ళానున్నారని ఇస్రో చీఫ్ కె శివన్ చెప్పారు. జాబితాలో ఉన్న నలుగురు వ్యోమగాములు ఈ నెల చివరి నాటికి శిక్షణ కోసం రష్యాకు వెళతారు. 1984 లో రాకేశ్ శర్మ రష్యన్ మాడ్యూల్లో ప్రయాణించారు. అయితే ఈసారి భారత వ్యోమగాములు భారతదేశం నుండి ఒక భారతీయ మాడ్యూల్లో ప్రయాణిస్తారు అని ఆయన విలేకరులతో అన్నారు. నలుగురు వ్యోమగాములకు 11 నెలల పాటు శిక్షణ లభిస్తుంది. మిషన్ కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు పురుషులు ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రి (మోస్) జితేంద్ర సింగ్ ఇంతకు ముందు చెప్పారు.

గగన్యన్ ప్రాజెక్టు శిక్షణ
రష్యాలో 11 నెలల పాటు శిక్షణ పొందిన తరువాత వ్యోమగాములు భారతదేశంలో కూడా మాడ్యూల్ యొక్క నిర్దిష్ట శిక్షణను పొందుతారు. ఇస్రో రూపొందించిన సిబ్బంది మరియు సర్వీస్ మాడ్యూల్లో వారికి శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణలో భాగంగా దీన్ని ఆపరేట్ చేయడం, దాని చుట్టూ పనిచేయడం మరియు అనుకరణలు చేయడం వంటివి నేర్చుకుంటారు.

గగన్యన్ ప్రాజెక్టు బడ్జెట్
ఇస్రో వర్గాల సమాచారం ప్రకారం భారతదేశపు భారీ ప్రయోగ వాహనం "బాహుబలి" GSLV Mark-III వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గగన్యన్ ప్రాజెక్టుకు రూ.10,000 కోట్లు కేటాయించింది.

ఇది ప్రయోగాత్మక పద్ధతిలో పంపించబోతున్న రోబో. అందువల్ల ఇది పనిచేసినా మరియు చేయకపోయినా శాస్త్రవేత్తలకు వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే భవిష్యత్తులో రోబో టెక్నాలజీని అందరూ వాడుకోక తప్పది కాబట్టి ఇస్రో కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇస్రో శాస్త్రవేత్త శ్యామ్ దయాళ్ ఈ రోబో విశేషాల్ని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వ్యోమమిత్ర చాలా బాగుందని అంతా అంటున్నారు. అచ్చం అమ్మాయిలాగే ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications








