Just In
- 10 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 17 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 18 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 20 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ఒక్క కాల్ కి అబ్దుల్ కలాం సై అనుంటే,ఇండియా చీకటిలోకి వెళ్లేది..
భారత పరిశోధన శక్తిని ఖండాతరాలకు చాటి చెప్పిన అస్త్రం అగ్నిఅనే విషయం అందరికీ తెలిసిందే.
భారత పరిశోధన శక్తిని ఖండాతరాలకు చాటి చెప్పిన అస్త్రం అగ్నిఅనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచదేశాలకు భారత ఆయుధ శక్తిని రుచి చూపించిన శక్తివంతమైన క్షిపణిపై అమెరికా తన కుట్రలకు తెరలేపిందా...అది ఆపేందుకు కుయుక్తులు పన్నిందా..అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.అగ్నిని ఆపాలని అప్పుడు మన మిస్సైల్ మ్యాన్ కలాంకు ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయని కలాం తన పుస్తకంలో స్వయంగా వెల్లడించారు.అయినా దేశ పతాకాన్ని ప్రపంచదేశాల పక్కన సగర్వంగా నిలపాలని మిస్సైల్ మ్యాన్ ఆ ఒత్తిళ్లకు లొంగలేదు. అప్పుడు కలాంకు వచ్చిన కాల్ మన దేశ రాతను మార్చివేసిన కాల్ అని చెప్పాలి. అది ఎలానో మీరే చూడండి.
మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు
అప్పటికే రెండు ప్రయోగాలు విఫలం
అప్పటికే రెండు ప్రయోగాలు విఫలమయ్యాయి తినడానికి సరిగ్గా తిండిలేదు. బాలాసోర్ లో 72 గంటల పాటు సైట్ లోనే జీవితం. ఎప్పుడూ కూల్ గా ఉండే కలాం ఆరోజు ఎంత టెన్సన్ పడ్డారో అక్కడున్న వారిని అడిగితే తెలుస్తుంది.
ఓ పక్క హేళనలు
ఓ పక్క హేళనలు.. మరో పక్క ఈ ప్రయోగం కూడా ఫెయిల్ అవుతుందా లేక విజయవంతమవుతుందా అన్న సందేహాలు..ఇలా అణుక్షణం కలాం అప్పుడు చిత్రవధ అనుభవించారని పుస్తకంలో రాసిన వివరాలు చెబుతున్నాయి.
ప్రయోగం ఫెయిల్ అయితే
ఓ దశలో ఈ ప్రయోగం ఫెయిల్ అయితే నేను శాశ్వతంగా పరిశోధన రంగం నుంచి నిష్క్రమిస్తానంటూ అప్పటికే శపధం కూడా చేశారు.
అగ్రదేశాలు నుంచి
అలా కలాం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలోనే అగ్రదేశాలు నుంచి ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ రాయబారాలు నడిపాయి.దుష్ట పన్నాాగానికి తెరలేపాయి.
ప్రయోగాన్ని ఆపాలంటూ కలాంపై ఒత్తిడి
మనదేశం ఆయుధరంగంలో దూసుకుపోతుందని పసిగట్టిన అగ్రరాజ్యాలు కుటిలనీతికి తెరలేపాయి. ప్రయోగాన్ని ఆపాలంటూ కలాంపై ఒత్తిడి తెచ్చాయి. కష్టాలకు వెరవని ధైర్యమున్న కలాం సారీ అంటూ వారికి తన మాటగా చెప్పారు.
మే 22, 1989
భారత్ ‘అగ్ని' క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. కొన్నిగంటల్లో ప్రయోగం జరుగుతుందనగా.. ఆరోజు వేకువజామున 3 గంటలకు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఇండియన్ మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఓ ఫోన్ వచ్చింది.
దాన్ని ఆపాలని
ప్రయోగం ఎంతవరకు వచ్చింది? దాన్ని ఆపాలని అమెరికా, నాటో కూటమినుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది' అని కాల్ సారాంశం. కలాం మదిలో ప్రశ్నలు మెదిలాయి.
ప్రయోగాన్ని ఆపే స్థితి
అప్పుడిక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్న కలాం ప్రయోగాన్ని ఆపే స్థితి దాటిపోయింది. ఇప్పుడేమీ చేయలేమని చెప్పారు. ఆరోజు తెల్లవారాక ఒడిశాలోని చాందీపూర్ నుంచి అగ్నిని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాలు కలాం చివరి పుస్తకం ‘అడ్వాంటేజ్ ఇండియా' లో ఉన్నాయి.
నాటో, అమెరికాల నుంచి తీవ్రమైన ఒత్తిడి
అంతరిక్ష పరిశోధన రంగంలో అగ్ని ప్రయోగం అత్యంత కీలక ఘట్టం. భారత్ అమ్ముల పొదిలో అత్యుత్తమ క్షిపణిగా నిలిచిన అగ్ని ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నాటో, అమెరికాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎందుకు వచ్చింది. 1989లో అగ్ని క్షిపణి పరీక్షించే సమయంలో ప్రయోగాన్ని ఆలస్యం చేయాలనే సందేశాన్ని హాట్లైన్ ఫోన్కాల్ ద్వారా దాని రూపకర్త, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఎందుకు అందుకున్నారు.
అడ్వాంటేజ్ ఇండియా: ఫ్రం చాలెంజ్ టు అపర్చునిటీ అనే పుస్తకంలో
కలాంకు ఆ సందేశాన్ని అందించింది ఎవరో కాదు.. టీఎన్ శేషన్. ఆ సమయంలో శేషన్ ఆనాటి ప్రధాని రాజీవ్గాంధీకి క్యాబినెట్ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఈ విషయాన్ని అడ్వాంటేజ్ ఇండియా: ఫ్రం చాలెంజ్ టు అపర్చునిటీ అనే పుస్తకంలో కలాం స్వయంగా వెల్లడించారు.
పుస్తకంలో వెల్లడించిన వివరాల ప్రకారం..
1989 మే 22న అగ్ని ప్రయోగానికి కొద్దిగంటల ముందుగా ఉదయం 3 గంటలకు హాట్లైన్ ద్వారా టీఎన్ శేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్కాల్ పరమార్థం మంచిగా గోచరించలేదు అని పేర్కొన్నారు.ఫోన్లో నా జవాబు వినకుండానే అగ్ని ప్రయోగ కార్యక్రమంలో మనం ఏ దశలో ఉన్నాం. మనపై అమెరికా, నాటోల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది. వారితో మనకు అనేక దౌత్యపరమైన ప్రయోజనాలున్నాయి . అగ్ని ప్రయోగాన్ని ఆలస్యం చేసే మార్గమేమైనా ఉందా? అని శేషన్ అడిగినట్లు కలాం తెలిపారు.
అగ్ని ప్రయోగాన్ని అడ్డుకునేందుకు
తాను జవాబు ఇచ్చేంతలోపే మరోసారి మళ్లీ అగ్ని ప్రయోగ ప్రక్రియలో మనం ఏదశలో ఉన్నామని అడిగారని పుస్తకంలో పేర్కొన్నారు. అగ్ని ప్రయోగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిఘావర్గాల సమాచారం తనకు అందిందని.. ప్రధాని, పీఎంవోపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నదనే విషయం తెలుసునని కలాం అడ్వాంటేజ్ ఇండియాలో వెల్లడించారు.
చండీపూర్ ప్రాంతాన్ని
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చండీపూర్ ప్రాంతాన్ని తుఫాన్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టే అవకాశాలున్నాయనే విషయం తనను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు.
ప్రాజెక్టుకు అడ్డంకిగా సమస్యలు
అసలు అగ్ని ప్రయోగానికి పదేండ్ల ముందే జట్టు ఎంపిక జరిగింది. పరిమితమైన బడ్జెట్, సాంకేతిక సౌకర్యాలు అందకపోవడం, ఇతర దేశాల నుంచి తొలగింపులు, మీడియా ఒత్తిడి లాంటి అనేక అంశాలు, సమస్యలు ప్రాజెక్టుకు అడ్డంకిగా నిలిచాయి.
సమస్యలన్నింటిని అధిగమించి
ఇలాంటి సమస్యలన్నింటిని అధిగమించి.. అగ్ని క్షిపణి ప్రయోగాన్ని సాకారం చేసేందుకు మహిళలు, పురుషులతో కూడిన శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతున్నారు అనే విషయం తన మదిలో మెదిలిందని తన పుస్తకంలో కలాం పేర్కొన్నారు.
ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షిపణి ప్రయోగం
ఇలాంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత.. తన గొంతు సవరించుకొని సర్.. ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షిపణి ప్రయోగం నిలిపివేసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రయోగాన్ని వాయిదా వేసుకోలేం. ఈ విషయంలో చాలా ఆలస్యంగా స్పందించారు అని చెప్పానని కలాం పేర్కొన్నారు.
అగ్ని క్షిపణి నిప్పులు చిమ్ముతూ
ఈ విషయంపై సుదీర్ఘమైన వాదన జరుగుతుందని భావించిన తనకు ఆశ్చర్యకరమైన రీతిలో.. ఒకే అయితే అలానే కానివ్వండి అని తన బాస్ శేషన్ ఉదయం 4 గంటల సమయంలో ఫోన్ పెట్టేశారని తెలిపారు. ఈ ఘటన అనంతరం మూడు గంటల తర్వాత 1989 మే 22న అగ్ని క్షిపణి నిప్పులు చిమ్ముతూ నింగిని చీల్చుకుంటూ దూసుకుపోయింది.
అంతరిక్ష పరిశోధన రంగంలో
ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ చరిత్రను తిరగరాసింది. మరుసటి రోజున చండీపూర్లోని క్షిపణి ప్రయోగ వేదికను తుఫాన్ పాక్షికంగా దెబ్బతీసింది. అయితే అప్పటికే అగ్ని ప్రయోగాన్ని సఫలం చేశామని విజయగర్వంతో మేమంతా ఉన్నాం అని కలాం తన పుస్తకంలో పేర్కొన్నారు.
అగ్ని 1,2.3.4,5
ఆనాడు ఈ ప్రయోగం ఆపి ఉంటే భారత్ పరిశోధన రంగంలో ఇప్పుడు ఎక్కడ ఉండేది.అగ్ని 1,2.3.4,5 ఇలా వరుసగా భారత్ అస్త్రాలు మన ముందుకు వచ్చేవి కావు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470