అక్టోబర్లో పెను ముప్పు, అందరికీ చావు తప్పదు !
శాస్త్రవేత్తలు షాకులు ఇస్తున్నారు. అక్టోబర్ లో భూవినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు.
శాస్త్రవేత్తలు షాకులు ఇస్తున్నారు. అక్టోబర్ లో భూవినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. భూమికి అతి పెద్ద ఉత్సాతం పొంచి ఉన్నదని, వందలాది తోక చుక్కలు కోట్ల అణుబాంబుల్లో విరుచుకుపడబోతున్నాయని చెబుతున్నారు. అవి భూమికి దగ్గరగా చక్కర్లు కొడుతూ 2017లో భూ వినాశనం చేయబోతున్నాయని శాస్ర్తవేత్తల పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

భూ గ్రహాన్ని నిబిరు అనే గ్రహం
ఈ ఏడాది అక్టోబర్ లో ప్రపచం కనుమరుగు కానుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. భూ గ్రహాన్ని నిబిరు అనే గ్రహం ఢీకొట్టేందుకు దూసుకొస్తోందని తద్వారా భూమి అంతమవుతుందని కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు వెల్లడిస్తున్నారు.

2003 నుంచి
2003 నుంచి ఇటువంటి వార్తలు వస్తున్నప్పటికీ వాటిని జనాలు నమ్మడం లేదు. అయినప్పటికీ ఈ సిద్ధాంత కర్తలు ఈ విషయాలను మరోసారి వెలుగులోకి తెస్తున్నారు.

డేవిడ్ మీడే అనే రచయిత
తాజాగా డేవిడ్ మీడే అనే రచయిత తన ప్లానెట్ టెన్ ది 2017 అరైవల్ పుస్తకంలో భూమి అంతరించి పోతుందనే విషయాన్ని పేర్కొన్నారు. వందేళ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు గ్రహం విచ్చిన్నం చేసిందని, ఇప్పుడు మళ్లీ వస్తోందని తెలిపారు.

నిబిరు గ్రహాన్ని 10వ గ్రహంగా
సౌర వ్యవస్థలో ఈ నిబిరు గ్రహాన్ని 10వ గ్రహంగా భావిస్తున్నారు. ఈ గ్రహం దక్షిణ ధృవం వైపు దూసుకొస్తున్నదని, దీని వెంట మరో ఏడు గ్రహాలు వస్తున్నాయని కుట్ర సిద్ధాంతకర్తలు చెబుతున్నారు.

భూకంపంతో పెను వినాశనం
ఇదిలో ఉంటే మరికొందరు శాస్ర్తవేత్తలు భూకంపంతో పెను వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ భూకంపం నార్త్ చైనా నుండి మొదలవుతుందని పెను విధ్వంసాన్ని సృష్టిస్తుందని చెబుతున్నారు.

కనుమరుగు కాకతప్పదని
మెక్సికో అలాగే మెక్సికన్ గల్ఫ్ దేశాలు, చైనా, జపాన్ లకు భారీ సునామిలు వచ్చే అవకాశం ఉందని, అవి కనుమరుగు కాకతప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరేబియన్ దేశాలను కూడా ఇందులో చేర్చారు.

కాలిఫోర్నియా 6.5 రీడింగ్ తో
ఇక అమెరికాలోని కాలిఫోర్నియా 6.5 రీడింగ్ తో పెను భూకంపానికి గురి అవుతుందని దాని ప్రభావం 30 సంవత్సరాల వరకు ఉండొచ్చని డా మెహ్రన్ కేషే అనే ప్రఖ్యాత నూక్లియర్ సైంటిస్ట్ చెబుతున్నారు.

చైనా అతలాకుతలం
అయితే అతను ఇంతకుముందు చెప్పినవన్నీ జరగడంతో ఈ వార్తలు కూడా నిజమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చైనాకు భూకంపం వస్తుందని ఇంతకుముందు హెచ్చరించారు. ఆయన చెప్పినట్లుగానే చైనా అతలాకుతలం అయింది.

ఉత్తర ,దక్షిణ అమెరికా రెండుగా
అతను చెప్పిన జ్యోతిష్యం ప్రకారం మెగా సునామీలు సంభవించి ఉత్తర ,దక్షిణ అమెరికా రెండుగా విడిపోతాయట. ఉత్తర అమెరికాకి , దక్షిణ అమెరికాకి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయట. ఈ సునామీల ద్వారా 40 మిలియన్ల జనం కనుమరుగవుతారని అంచనా.

20 మిలియన్ జనాలు
కేవలం ఉత్తర , దక్షిణ అమెరికాలోనే రాబోయే ఈ భూకంపం ద్వారా 20 మిలియన్ జనాలు దారుణంగా చనిపోతారని ఈ సైంటిస్టు బల్ల గుద్దీ మరీ చెబుతున్నారు.

ఇవన్నీ పుకార్లని
మరి ఇవన్నీ పుకార్లని మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ శాస్తవేత్తలు చెప్పింది నిజాలయ్యేవరకు వాటిని నమ్మలేము. ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి.


Click it and Unblock the Notifications








