ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
మూడవ ప్రపంచయుద్ధమంటూ జరిగితే అది ఖచ్చితంగా అణు బాంబులతోనే ముడిపడి ఉంటుంది. న్యూక్లియర్ వెపన్స్ ఎంతంటి ప్రమాదకరమో మనందరికి తెలుసు. అణుబాంబుల విలయానికి ప్రపంచమే తుడిచిపెట్టుకుపోగలదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే హిరోషిమా ఘోర కలే. జపాన్లోని చారిత్రక పట్టణాల్లో హిరోషిమా ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో భాగంగా అమెరికా జపాన్ పై ఈ అణుబాంబుల దాడి జరిపింది. మరింత ఆసక్తికర సమాచారం క్రింది స్లైడ్షోలో...
Read More : రూ.4,799కే రిలయన్స్ LYF 4జీ ఫోన్

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
1945, ఆగస్ట్ 6వ తేదీన మొదటి అణుబాంబును హిరోషిమా నగరం పై, రెండవ అణుబాంబును ఆగస్ట్ 9వ తేదీన నాగసాకి నగరం పై ప్రయోగించింది.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
దీంతో ఆ రెండు జపనీస్ నగరాల్లో 2 లక్షలకుపైగా సామాన్య పౌరులు మరణించారు. నగరమంతటా వేల డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మంటలు వ్యాప్తి చెందాయి. ఈ మంటల దాటికి జనం నిలువెల్లాకాలిపోగా, భవనాలు నేలమట్టమైపోయాయి. దట్టమైన చీకటి ఆవరించి, నల్లని పొగ వర్షం కురిసింది.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
రేడియో యాక్టివ్ థార్మిక కిరణాలు వ్యాపించి ప్రజలు క్యాన్సర్లు బారిన పడ్డారు. వారికి జన్మించిన పిల్లలు కూడా అవయవ లోపాలతో భాదపడ్డారు.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
అమెరికా అణు వినాశనం ధాటికి ఆ రెండు నగరాలు మరుభూములుగా మారిపోయాయి. తిరిగి కోలుకోటానికి ఏకంగా 10 సంవత్సరాలు పట్టింది.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
అమెరికాను ఉద్దేశించి తాజాగా ఉత్తర కొరియా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
తాము శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా సంచలన ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా అగ్రరాజ్యాలు ఉలక్కిపడ్డాయి.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
హైడ్రోజన్ బాంబుకు దేశాలను తుడిచిపెట్టేయగల సామర్థ్యం ఉంది. ఇప్పటికిప్పుడు న్యూక్లియర్ వార్కు తెరలేగిస్తే పరిస్దితులు ఎలా ఉంటాయో విశ్లేషకుల మాటల్లోనే విందాం...

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
న్యూక్లియర్ వెపన్స్ దాటికి ప్రజలకు అప్రమత్తం చేసే నాలుగు నిమిషాల వార్నింగ్ వ్యవస్థ పనిచేయక పోవచ్చు.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
న్యూక్లియర్ దాడుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు టెక్స్ట్ మెసేజ్ వార్నింగ్ సిస్టంను పలు దేశాలు పరీక్షించాయి. దాడికి కొన్ని నిమిషాల ముందు వార్సింగ్ సందేశాలు మీ ఫోన్ కు అందొచ్చు.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
ఖండాతర బాలిస్టిక్ క్షిపణిలను నిలవరించేందుకు ఇప్పటికప్పుడు అయితే ఏ విధమైన టెక్నాలజీ అందుబాటులోకి లేదు. కాబట్టి, ఫోన్ మెసేజ్ చూసుకుని అలర్ట్ అయ్యే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోవచ్చు.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
న్యూక్లియర్ బాంబుకు దగ్గరగా ఉన్న వ్వక్తులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు. వారి ఆవయువాలను గుర్తించటం కూడా చాలా కష్టం. హిరోషిమా అణు విస్పోటనంలో భాగంగా కిలోమీటర్ల మేర వ్యాపించిన అణు వేడి వేల మంది ప్రజానీకాన్ని బూడిద చేసేసింది.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
హైడ్రోజన్ బాంబులు మొత్తం నగరాన్నే నాశనం చేయగలవు. వీటి శక్తిసామర్థ్యాలు అపారం.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
న్యూక్లియర్ వార్ కు తెరలేస్తే యావత్ ప్రపంచం పెను ప్రమాదంలో పడ్డట్టే.

ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...
అణు బాంబు ధాటికి ధ్వంసమైన హిరోషిమా నగరం

అణు బాంబు ధాటికి ధ్వంసమైన హిరోషిమా నగరం
అణు బాంబు ధాటికి ధ్వంసమైన హిరోషిమా నగరం


Click it and Unblock the Notifications








