ఈ భూమి మీద బతకలేను,ఫేస్బుక్ లైవ్ ద్వారా సూసైడ్
కొన్ని విషాదాలు మనుషుల్ని ఎంతో లోతుల్లోకి తీసుకెళతాయి.ఈ భూమి మీద ఉండలేననే నిర్ణయాలను తీసుకునే విధంగా వారిని ప్రేరేపిస్తుంటాయి.
కొన్ని విషాదాలు మనుషుల్ని ఎంతో లోతుల్లోకి తీసుకెళతాయి. ఈ భూమి మీద ఉండలేననే నిర్ణయాలను తీసుకునే విధంగా వారిని ప్రేరేపిస్తుంటాయి. ఇప్పుడు ఈ ఘటన కూడా సరిగ్గా అలాంటి కోవలోకే వస్తుంది. ఈ భూమి మీద నాకు బతికే అర్హత లేదంటూ ఓ వ్యక్తి ఫేస్బుక్ లైవ్ ద్వారా సూసైడ్ చేసుకున్నారు. స్నేహితులు అలర్ట్ అయ్యే లోపే అంతా జరిగిపోయింది. అకస్మాత్తుగా అతను తీసుకున్న నిర్ణయంతో సోషల్ మీడియా ప్రపంచం ఒక్కసారిగా విషాదంలోకి జారుకుంది. దీనికి సంబంధించిన కథనాన్ని హిందూస్థాన్ టైమ్స్ ప్రచురించింది. ఈ కథనం ప్రకారం..

Arindam Dutta (43) అనే వ్యక్తి..
Arindam Dutta (43) అనే వ్యక్తి Darjeeling's Siliguriలోని Hakimparaలో గల Purba Vivekananda Palliలో నివసిస్తున్నారు. అతని ఫేస్ బుక్ అకౌంట్ నుండి లైవ్ వీడియోను ఇస్తూ ఈ ప్రపంచానికి సెలవు అంటూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బ్లడ్ క్యాన్సర్ తో..
కాగా ఇతను బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఈ వ్యాధి తీవ్రత అధికం కావడంతో పాటు మరికొన్ని కారణాలతో అతను సూసౌడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నైలాన్ తాడును మెడకు బిగించుకోవడం ద్వారా అతను ఆత్మహత్యకు పాల్పడ్డారు.

దాన్ని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ..
ఈ లైవ్ ని చూసిన అతని స్నేహితులు 5 గురు దాన్ని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కామెంట్ల ద్వారా ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. కొంతమంది కాల్ చేసినా అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. చివరకు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు.

చనిపోడానికి కొన్ని నిమిషాల ముందు..
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే చనిపోడానికి కొన్ని నిమిషాల ముందు అతని చిన్ననాటి స్నేహితుడు Mohammed Alamకి కాల్ చేయగా అతను ఎత్తలేకపోయాడు. ఇతను కలకత్తాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

అతని భార్యకు కాల్ చేసి..
స్నేహితుడు ఫోన్ ఎత్తకపోవడంతో అతని భార్యకు కాల్ చేసి నాకు ఈ భూమి మీద బతకడం ఇష్టం లేదని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన ఆమె ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది. అయితే ఈ లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది.

కాల్ ఎత్తి ఉంటే..
నేను ఆ కాల్ ఎత్తి ఉంటే ఫలితం మరోలో ఉండేదేమోనని అతని స్నేహితుడు అలాం భాదాతప్త హృదయంతో పోలీసులకు తెలిపారు. ఇతను తన ట్రీటిమెంట్ కంటిన్యూ చేస్తున్నాడని ఇలాంటి విషాద నిర్ణయం తీసుకుంటాడని ఆలోచించలేదని తెలిపారు.

ఇంటర్నెట్ కేఫ్ నడుపుకుంటూ..
అయితే చనిపోయిన వ్యక్తి ఊరి నుంచి మూడు వారాల క్రితమే అతని స్నేహితుని కుటుంబం కలకత్తాకు వచ్చింది. అతని ఫేస్ బుక్ లోని వివరాల ప్రకారం అతని ఇంటర్నెట్ కేఫ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తెలుస్తోంది.

భార్యతో విడాకులు..
ఇతనికి భార్యా, కూతురు ఉన్నారు. భార్య విడాకులు తీసుకుంది. assistant commissioner of police Achinta Gupta ఈ వివరాలను వెల్లడించారు.


Click it and Unblock the Notifications








