సోషల్ మీడియాని వణికిస్తున్న ఒకే ఒక్క వెడ్డింగ్ కార్డు
రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కూతురు ఈషా అంబానీ పెళ్లి త్వరలో జరగనుంది.
రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కూతురు ఈషా అంబానీ పెళ్లి త్వరలో జరగనుంది. పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల ఓనర్) తనయుడు ఆనంద్ పిరామల్ అంబానీల ఇంటికి అల్లుడుగా వెళ్లనున్నాను. ఈ పెళ్లి దేశంలో ఎవ్వరూ చేయని విధంగా అత్యంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు అంబానీ కుటుంబం అలాగే పిరామల్ కుటుంబం రెడీ అయింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వారి వెడ్డింగ్ కార్డు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఈ వెడ్డింగ్ కార్డు వీడియో ఎలా ఉందో మీరే చూడండి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబాని పెళ్లికి సంబంధించిన శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇషా వెడ్డింగ్ కార్డు రెండు బాక్సుల్లో అందంగా అమర్చారు. అంబానీ ఫ్యామిలీకి తగ్గట్టు పెళ్లికార్డును డిజైన్ చేశారు.

ఒక బాక్సులో వధువు వరుడు పేర్లను ఉంచి పూలతో అందంగా డెకరేట్ చేశారు...
ఒక బాక్సులో వధువు వరుడు పేర్లను ఉంచి పూలతో అందంగా డెకరేట్ చేశారు. మరో బాక్సులో నాలుగు చిన్న బంగారు బాక్సులు ఉన్నాయి. అందులో ఒక చిన్న బాక్సులో సరస్వతి దేవీ విగ్రహాన్ని ఉంచారు . తమ హోదాకు ఏమాత్రం తగ్గకుండా మ్యారెజ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించింది అంబానీ ఫ్యామిలీ అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆనంద్ పిరమాల్తో ఇషా అంబాని వివాహం జరగనుంది....
వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్తో ఇషా అంబాని వివాహం జరగనుంది. ఇషా, ఆనంద్లు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇక ఆనంద్ పిరమాల్ది కూడా చాలా సంపన్న కుటుంబం. తల్లిదండ్రులు కార్పొరేట్ ప్రపంచంలో సూపర్ స్టార్లు.

పెళ్లి తంతు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది....
పెళ్లి తంతు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. వివాహ వేడుకకు ముందు వారాంతంలో అంబానీ, పిరమాల్ కుటుంబాలు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉదయ్పుర్లో ఘనంగా విందు ఏర్పాటు చేయబోతున్నారు.

ఈషా, ఆనంద్ల జంటకు ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నారు...
పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈషా, ఆనంద్ల జంటకు ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నారు. డిసెంబరు 12న ఈ పెళ్లి జరగనుంది. అయితే ఈ పెళ్లి ఎక్కడ జరుగుతుందనే దానిపై క్లారిటీ లేనప్పటకీ ఉదయ్ పూర్ లో జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే...
వీరి సంగీత్ కార్యక్రమంలో ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ప్రదర్శన ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం రూ.15 కోట్లు ఆమెకు పారితోషికం అని తెలుస్తోంది. ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆమె 2 మిలియన్ డాలర్లు పారితోషికంగా తీసుకుంటారు.

ఇటలీలోని లేక్ కోమోలో ఆనంద్ - ఇషా నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది....
కొద్ది రోజుల క్రితం ఇటలీలోని లేక్ కోమోలో ఆనంద్ - ఇషా నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. వీరితో పాటు త్వరలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల తనయుడు ఆకాష్ అంబానీ, రోసీ బ్లూ డైమెండ్స్ అధినేత రస్సెల్ మెహతా కూతురు శ్లోకలు కూడా పెళ్లి చేసుకోనున్నారు.


Click it and Unblock the Notifications








