Just In
- 14 hrs ago iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- 15 hrs ago ధర రూ.12000 కంటే తక్కువ ధరకే 45W ఛార్జింగ్ సపోర్టుతో రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్ వివరాలు..!
- 17 hrs ago Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- 19 hrs ago Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- News హైదరాబాదు వాసులకు కూల్ న్యూస్.. పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Movies Karthika Deepam 2 పారిజాతం కళ్లలో ఆనందం కోసం బంటు.. దీపను మెప్పించిన కార్తీక్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
దటీజ్ ఇండియా :మనోళ్ల దేశభక్తికి ఫేస్బుక్ సైతం సలాం కొట్టింది
ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగిన వేళ సోషల్ మీడియా త్రివర్ణ పతాకంతో మోరెత్తిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఫోటో మాత్రం వైరల్ గా మారి అందరీ చేత సలాం కొట్టించింది.
ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగిన వేళ సోషల్ మీడియా మన త్రివర్ణ పతాకంతో హోరెత్తిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఫోటో మాత్రం వైరల్ గా మారి అందరీ చేత సలాం కొట్టించింది. అసోంలో వరదలు ముంచెత్తి అల్లకల్లోలమవుతున్న వేళ అక్కడ ఓ పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశం మొత్తాన్ని ఆకర్షించాయి. నడుం లోతు నీళ్లలో నుంచి పిల్లలు జాతీయ జెండాకు చేసిన జెండావందనం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఫోటో లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది.
హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు
ఇద్దరు చిన్నారులు భుజాల వరకు వరద నీరు ఉన్నప్పటికీ
దాని వివరాల్లోకివెళ్తే...అసోంలోని ధుబ్రి ప్రాంతంలోని నష్కర ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగురవేశారు. జెండా వందన కార్యక్రమానికి ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు.వారిలో ఇద్దరు చిన్నారులు భుజాల వరకు వరద నీరు ఉన్నప్పటికీ వాళ్లు మాత్రం జెండా వందనం చేస్తూ నిలబడ్డారు.
ప్రస్తుతం మేము ఎలా ఉన్నామనేది చెప్పలేము
దీని గురించి ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు మిజనూర్ రెహమాన్ వివరిస్తూ, సంబంధిత ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ‘ప్రస్తుతం మేము ఎలా ఉన్నామనేది చెప్పలేము.. ఈ ఫొటోనే చెబుతుంది' అని ఆయన రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో
ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో జరిగే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, ఫొటోలతో సహా తీసి విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, జిల్లా విద్యాధికారికి పంపారు.
సజీవ సాక్ష్యాలుగా ఇలాంటి ఫోటోలు
చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఇలాంటి ఫోటోలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మరుగునపడిపోయాయి.. ప్రపంచం మరచిపోయిన ఆ చిత్రాలను మళ్లీ ఓ సారి గుర్తు చేసుకుందాం.
1972వ సంవత్సరంలో వియాత్నం యుద్ధం సమయంలో నాపలమ్పై దాడి జరుగుతున్న వేళ ఓ చిన్నారి ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు ఏడుస్తూ నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఓ ఫోటో ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. అక్కడ యుద్ధ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. పులిట్జర్ బహుమతి గ్రహీత నార్వే ఫోటోగ్రాఫర్ నిక్ అట్ ఈ విషాద చిత్రాన్ని తన కెమెరాలో బంధించి ప్రపంచానికి అక్కడ జరుగుతున్న విషాదాన్ని తెలియజేయాలని తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నా
డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నానంటూ చిన్న పిల్లాడు పరిగెడుతున్న చిత్రం.యుద్ధంలోకి వెళుతున్న చాలామందికి ఈ చిత్రం చూసిన తరువాత ఎంతో వేదన కలిగే ఉంటుంది. తన పిల్లల మీద ప్రేమను చూపెడుతోంది. యుద్ద పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చూపే ఈ చిత్రాన్ని డెట్లాఫ్ తీసారు.
చెగువేరా చివరిక్షణం
ప్రపంచాన్నికి ఉద్యమం అంటే ఏంటో తెలియజెప్పిన చెగువేరా చివరిక్షణంలో ఇలా నేలకొరిగినప్పుడు తీసిన చిత్రం ఇది. దీనికి అందరూ చే లైవ్స్ అని స్లోగన్ కూడా ఇచ్చారు.
సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్
జర్మనీలో గల బెర్గిన్ లోని క్యాంప్ శిబిరంలో సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్ దీనంగా నడుస్తున్న చిత్రం. ఈ శవాలను ఓ చోటుకు చేర్చి తగలబెట్టడం ఇతని ప్రధాన విధి..ఇలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాలను చూసిన యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. ఈ చిత్రం ప్రపంచాన్నే మార్చి వేసింది.
పసిమనస్సులపై యుద్ధ ప్రభావం
పాలబుగ్గల ఈ చిన్నారి ఫొటో మొన్నటివరకూ సోషల్ నెట్వర్క్లో విపరీతంగా చూసేలా చేసింది. చేస్తూనే ఉంది. సిరియా శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న ఈ చిన్నారిని ఓ ఫొటోగ్రాఫర్ ఫొటో తీస్తుండగా ఆ చిన్నితల్లి కెమేరాను చూసి గన్ అనుకుంది.అంతే ఇలా చేతులెత్తి, లొంగిపోతున్నట్లు నిలబడి పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఫొటోగ్రాఫర్ కూడా కదలిపోయి, ఆనక తన కెమేరాలో బంధించి ఇలా మన ముందుంచారు. నిత్యం బాంబులు, తుపాకుల మధ్య లక్షలాది చిన్నారుల బతుకులు ఎలా భయభ్రాంతుల్లో కొట్టుమిట్టాడుతుందో ఈ చిత్రం అద్దంపడుతోంది. పసి మనస్సులపై ఉగ్రవాదం వేసిన ముద్రకు ఈ ఫొటో కన్నా వేరొకటి అవసరం లేదేమో!
ప్రపంచదేశాలను కదిలించిన చిత్రం
యూరప్ ద్వంద్వ ప్రమాణాల్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం అది. అదే సముద్రతీరాన చనిపోయి పడివున్న బాలుని చిత్రం.నీలోఫర్ డెమిర్ అనే పాత్రికేయురాలు తన కెమెరాలో ఈ చిత్రాన్ని బంధించింది. ఈ చిత్రం సొంత ఊరు, కన్నవారినీ వదిలి చేతబట్టుకుని పొరుగు దేశాలకు వెళ్లే శరణార్థుల వెతల్ని చూపెడుతోంది. ఈ ఫొటో చూసి ఇప్పటికే కోటాను కోట్ల మంది కన్నీరు పెట్టి ఉంటారు.
సూడాన్ కరువు
ఆకలితో బక్కచిక్కిన శరీరం, ఎముకల గూడుగా మారి తల వంచిన చిన్నారి.. చనిపోతే బాగుండు తినేద్దాం అని ఎదురుచూసే రాబందు.. ఈ చిత్రం చూస్తే ఎంత కరడుగట్టిన వారినైనా కదలిస్తుంది. సూడాన్లో నాటి కరువు పరిస్థితులకు అద్దం పట్టిందీ చిత్రం. ఈ చిత్రాన్ని కెవిన్ కార్టర్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాతో 1993లో చిత్రీకరించారు. అయితే ఆ బాలుడిని రక్షించకుండా కెవిన్ వచ్చేశాడు. ఆ తర్వాత కెవిన్కు మంచి కానుకే లభించింది. కానీ అతను తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బాలుడిని రక్షించలేదన్న బాధతోనే కెవిన్ కొన్ని నెలల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470