ఈ సినిమాపై జోకులను చూస్తే ఆ సినిమానే మరచిపోతారు
యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ యాక్షన్ అడ్వంచరస్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' దీపావళి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెల్సిందే.
యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ యాక్షన్ అడ్వంచరస్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' దీపావళి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెల్సిందే. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ సినిమాలో నటించడం దానికి తోడు అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, దంగల్ ఫేమ్ ఫాతీమా సనా షేక్ లాంటి తారాగణం నటించడంతో ఈ సినిమా కి చాలా హైప్ క్రియేట్ అయింది. 1839 కాలం నాటి 'Confessions of a Thug' నవల ఆధారంగా 'DHOOM-3' ఫేమ్ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సుమారు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బందిపోటు దొంగగా నటించడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసి వచ్చిన అభిమానులు 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' పై భారీ ట్రాలింగ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసి వచ్చిన అభిమానులు 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' పై భారీ ట్రాలింగ్ చేస్తున్నారు.
అమీర్ ఖాన్ స్థాయికి తగ్గట్లుగా ఈ చిత్రం లేదని...
అమీర్ ఖాన్ స్థాయికి తగ్గట్లుగా ఈ చిత్రం లేదని సినిమాకంటే ట్రైలరే బీభత్సంగా ఉందని ఇలాంటి సినిమాకు రూ. 300 కోట్లు ఖర్చు దండగ అంటూ ఈ సినిమా పై సోషల్ మీడియాలో ట్రాల్స్ చేస్తున్నారు.

తొలిరోజు కలెక్షన్లు...
తొలిరోజు కలెక్షన్లు దేశీయ బాక్సాఫీస్ వద్ద థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం తొలి రోజు రూ.50 కోట్లు రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్లు భారీగా కావడంతో, 5000 థియేటర్లలో రిలీజ్ కావడం ఈ సినిమా వసూళ్లకు ఊతమిచ్చింది.

రెండో రోజు కలెక్షన్లు...
ఇక రెండో రోజు కలెక్షన్లు, ఆక్యుపెన్సీ తొలిరోజుతో పోల్చుకొంటే 50 శాతం పడిపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రెండో రోజు ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications








