చావు అంచులదాకా వెళ్లొచ్చిన 17 ఏళ్ళ అమ్మాయి..వైరల్ అవుతున్న వీడియో
కదులుతున్న రైలు లేదా బస్సుల్లో ఫుట్బోర్డు ప్రయాణం ఎంతో ప్రమాదకరమో అందరికి తెల్సిందే .ఇప్పటి వరకు చాలా మంది అలా ఫుట్బోర్డింగ్ చేస్తూ ప్రాణాలు పోకుటుకున్నారు . ప్రస్తుతం అలాంటి ఘటన అక్టోబరు 1న మహా
కదులుతున్న రైలు లేదా బస్సుల్లో ఫుట్బోర్డు ప్రయాణం ఎంతో ప్రమాదకరమో అందరికి తెల్సిందే .ఇప్పటి వరకు చాలా మంది అలా ఫుట్బోర్డింగ్ చేస్తూ ప్రాణాలు పోకుటుకున్నారు . ప్రస్తుతం అలాంటి ఘటన అక్టోబరు 1న మహారాష్ట్రలోని ఘాట్కోపర్, విక్రోలీ ప్రాంతాల మధ్య చోటుచేసుకుంది.అయితే తన లక్ బాగుండి పక్క వాళ్ళు సహాయం చేయడంతో ప్రాణాలతో బ్రతికింది .
అయితే ఈ ఘటన మొత్తం వీడియో తీసిన మరో ప్రయాణికుడు వాట్సాప్లో షేర్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.

ముంబయి లోకల్ రైల్లో...
ముంబైకి చెందిన పూజా భోస్లే(17) ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఘట్కోపర్, విఖ్రోలివైపు వేళ్లే లోకల్ రైలు ఎక్కింది.ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తోంది. డోర్ హ్యాండిల్ పట్టుకుని వేలాడుతూ చేతులు బయటకు చాచి నించోవడానికి ప్రయత్నించింది.

పక్క నుంచి మరో లోకల్ రైలు రావడంతో....
ఇంతలో పక్క నుంచి మరో లోకల్ రైలు రావడంతో కంగారులో ఆమె చేతులు వదిలేసింది. దీంతో ఆమె పట్టుతప్పి కింద పడబోయింది.

పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు ....
ఆమె పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు ఆమె దుస్తులు పట్టుకుని, తోటి ప్రయాణికుల సాయంతో ఆమెను పైకి లాగాడు. లేకపోతే ఆమె కిందపడి ప్రాణాలు కోల్పోయేది.

అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో....
ఇంకా పని అయిపోయిందనుకుంటున్న సమయంలో అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. స్పల్ప గాయాలైన పూజను ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


Click it and Unblock the Notifications








