రూ.11 వేలకే 90Hz డిస్ప్లే, 11.35 అంగుళాల స్క్రీన్, 8000mAh బ్యాటరీ.. రూ.20,000లోపు బెస్ట్ ట్యాబ్లెట్లు ఇవే..!
Best Tablets Under Rs 20000: విద్యార్థులకు, ఉద్యోగులకు, ఇంకా ఇతరులకు ట్యాబ్లెట్లు చాలా అవసరంగా మారాయి. ఆన్లైన్ క్లాసులు వినాలన్నా, సరదాగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలన్నా, వీడియో కాల్స్ మాట్లాడాలన్నా, లేదా లేటెస్ట్ IPL మ్యాచ్ చూడాలన్నా... ట్యాబ్లెట్లు మంచి పరికరాలుగా నిలుస్తున్నాయి. వీటికి సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మంచి ట్యాబ్లెట్ కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండియా మార్కెట్లో రూ.20,000లోపే అద్భుతమైన ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి.
మేం మీకోసం అలాంటి ఐదు బెస్ట్ ట్యాబ్లెట్లను ఎంపిక చేశాం. ఇవి తక్కువ ధరకే దొరుకుతున్నాయి, అంతేకాదు ఆన్లైన్ సేల్స్ టైంలో ఇంకా మంచి డిస్కౌంట్లతో కూడా లభిస్తాయి. ఏప్రిల్ 2025 నాటికి మీరు పరిగణించదగిన ఐదు బడ్జెట్ ట్యాబ్లెట్లు ఇవే.

* శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9+ (Samsung Galaxy Tab A9+)
దీని ధర రూ.17,999. రూ.20,000లోపు ఉన్న టాప్ ఆప్షన్లలో ఇది ఒకటి. ఇందులో స్నాప్డ్రాగన్ 695 5G చిప్సెట్ ఉంది, కాబట్టి రోజువారీ పనులకు ఇది చాలా స్మూత్గా పనిచేస్తుంది. దీనిలోని శాంసంగ్ డెక్స్ (Samsung DeX) ఫీచర్ మీకు కంప్యూటర్ లాంటి మల్టీటాస్కింగ్ అనుభూతిని ఇస్తుంది. ఒకేసారి మూడు యాప్స్ను స్ప్లిట్-స్క్రీన్ మోడ్లో వాడొచ్చు.
11-అంగుళాల LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో వీడియోలు, స్క్రోలింగ్ చాలా బాగుంటాయి. డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్తో కూడిన నాలుగు స్పీకర్లు మంచి ఆడియో అనుభూతిని అందిస్తాయి. 7,040mAh బ్యాటరీ ఎక్కువ సేపు ఛార్జింగ్ నిలుస్తుంది. ఎడిటింగ్ లాంటి పనులు కూడా చేసుకోవచ్చు.
* లెనోవో ట్యాబ్ ఎం11 (Lenovo Tab M11)
దీని ధర రూ.12,499. విద్యార్థులకు, క్రియేటివ్ పనులు చేసేవారికి ఇది బాగా సరిపోతుంది. దీనితో పాటు ఒత్తిడిని గుర్తించే పెన్ (Pressure-sensitive pen) వస్తుంది, ఇది బొమ్మలు గీయడానికి, నోట్స్ రాసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. 11-అంగుళాల డిస్ప్లే మంచి వ్యూ ఇస్తుంది.
డాల్బీ అట్మాస్ సౌండ్తో కూడిన నాలుగు స్పీకర్లు సౌండ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. సినిమాలు చూసేందుకు కూడా ఇది చాలా బాగుంటుంది. చాలా మంది ఇప్పటికీ ఇష్టపడే 3.5mm హెడ్ఫోన్ జాక్ కూడా ఇందులో ఉంది. పనికి, సృజనాత్మకతకు రెండిటికీ ఉపయోగపడే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ ఇది.
* ఇన్ఫినిక్స్ ఎక్స్ప్యాడ్ (Infinix XPAD)
దీని ధర రూ.11,999. AI వాయిస్ అసిస్టెంట్, చాట్జీపీటీ ఇంటిగ్రేషన్ దీని ప్రత్యేకత. DTS ఆడియోతో కూడిన క్వాడ్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉంది. దీని పెద్ద డిస్ప్లే వీడియోలు చూడటానికి, చదువుకోవడానికి అనువుగా ఉంటుంది. బడ్జెట్ ధరలో వినోదంతో పాటు స్మార్ట్ అసిస్టెంట్ ఫీచర్లను అందించే ప్రత్యేకమైన ట్యాబ్లెట్ ఇది.
* రెడ్మీ ప్యాడ్ ఎస్ఈ (Redmi Pad SE)
ధర రూ.10,999. ఇది తక్కువ ధరలో మంచి విలువను అందిస్తుంది. 11-అంగుళాల డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్ చాలా స్మూత్గా ఉంటాయి. TUV రైన్ల్యాండ్లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉండటంతో ఎక్కువ సేపు వాడినా కళ్లకు హాయిగా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 680 చిప్సెట్తో సాధారణ పనులకు బాగా పనిచేస్తుంది.
ఇందులో కూడా డాల్బీ అట్మాస్తో నాలుగు స్పీకర్లు ఉన్నాయి. మల్టీటాస్కింగ్ కోసం స్ప్లిట్-స్క్రీన్ మోడ్కు సపోర్ట్ చేస్తుంది. అంటే దాదాపు 11 వేల లోపే ఇంత మంచి ఉపయోగకరమైన ఫీచర్లను ఇది అందిస్తోంది. డబ్బులు తక్కువ ఉన్నాయనుకుంటే దీన్ని కచ్చితంగా కొనొచ్చు.
* వన్ప్లస్ ప్యాడ్ గో (OnePlus Pad Go)
మొదట రూ.19,999 ధర ఉన్న ఈ ట్యాబ్లెట్, ఇప్పుడు కేవలం రూ.15,999కే అమ్ముడవుతోంది. దీని 11.35-అంగుళాల పెద్ద డిస్ప్లే సినిమాలు చూడటానికి, చదువుకోవడానికి చాలా బాగుంటుంది. 8,000mAh భారీ బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ సులభంగా వస్తుంది.
వీడియో కాల్స్, సాధారణ ఫొటోల కోసం ముందు, వెనుక 8MP కెమెరాలు ఉన్నాయి. రూ.20,000 లోపు మంచి స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








