రూ. 2వేల క్యాష్బ్యాక్తో శాంసంగ్ గెలాక్సీ Tab A 7.0 విడుదల
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎ 7.0 ను తాజాగా విడుదల చేసింది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎ 7.0 ను తాజాగా విడుదల చేసింది. దీని ధరను రూ.9,500గా శాంసంగ్ నిర్ణయించింది. దీనిపై జియో రూ.2వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ను అందిస్తున్నది. కాగా దీనిపై జియో ఆఫర్ను ప్రకటించింది. ఈ ట్యాబ్లెట్ పీసీలో జియో సిమ్ వేసి రూ.299 ప్లాన్ను 24 నెలల పాటు వాడితే మొదటి 12 నెలల అనంతరం కస్టమర్లకు రూ.800 , తదుపరి 12 నెలల అనంతరం మరో రూ.1200 క్యాష్ బ్యాక్ వస్తుంది. మొత్తంగా రూ.2వేల క్యాష్ బ్యాక్ వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 7.0 ఫీచర్లు
7 ఇంచ్ డిస్ప్లే, 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
Comments
Best Mobiles in India
English summary
Samsung Galaxy Tab A 7.0 launched in India at Rs 9,500, Reliance Jio offering Rs 2,000 cashback More News at Gizbot Telugu
Story first
published: Wednesday, January 10, 2018, 17:35 [IST]


Click it and Unblock the Notifications








