ఈ యాప్ జియో, వాట్సప్లను సైతం హడలెత్తిస్తోంది
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించిన 'భీమ్' యాప్ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించిన 'భీమ్' యాప్ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. డిసెంబర్ 30 న లాంచ్ అయిన భీమ్ 'భీమ్' ( 'భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ'.) యాప్ అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్, ఫేస్బుక్ వంటి ప్రముఖ యాప్లను తలదన్నుతూ ప్లే స్టోర్ నుంచి డోన్లోడ్ అవుతోంది.
ప్రధాని ఆవిష్కరించిన భీమ్ యాప్ గురించి పూర్తి సమాచారం..

లాంచ్ అయిన మూడురోజుల్లోనే గూగుల్ ప్లే స్టోర్ చార్ట్ లో నెంబర్ 1 ప్లేస్ కొట్టేసింది. గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఇరవై లక్షల (రెండుమిలియన్ల) డోన్ లోడ్స్ సాధించింది. వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, చాలా తక్కువ సమయంలో రెండు మిలియన్లమంది ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
ఆపిల్ ఐఫోన్ 8పై సరికొత్త నిజాలు

దీంతో భీమ్ విజయంపై ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ ఆదారిత చెల్లింపుల కోసం మోడీ డిసెంబర్ 30న ఈ యాప్ ను ప్రారంభించారు. అంబేద్కర్ కు నివాళిగా వచ్చిన ఈయాప్ ద్వారా నేరుగా డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం ఉంది. ఈ యాప్ అద్భుతాలు సృష్టిస్తుందని కొనియాడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








