సూపర్ కంప్యూటర్ ‘పరమ్ యువ 2’ ఆవిష్కరణ
ఇండియాలోనే వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ‘పరమ్ యువ 2'ను పూణే సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డక్) శుక్రవారం ఆవిష్కరించింది. ఈ సూపర్ కంప్యూటర్కు ప్రపంచవ్యాప్తంగా 62వ స్థానం లభించింది. 500 టెరాఫ్లాప్ల సామర్ధ్యం కలిగిన ఈ భారీ కంప్యూటర్ను సైంటిఫిక్ ఇంకా వాతావరణ అవసరాలకు ఉపయోగించనున్నారు.
మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్సైట్లు (వరల్డ్ వైడ్)
ప్రభుత్వంలోని ప్రధాన శాఖలకు, పరిశోధనా బృందాలకు, రక్షణ విభాగాలకు కంప్యూటర్, కమ్యూనికేషన్ రంగాల్లో నాణ్యమైన సేవలనందించటంలో సీ-డక్ గత కొద్ది సంవత్సాలుగా కీలక పాత్రోపోషిస్తోంది.

పరమ్ యువ 2 ఆవిష్కరణ కార్యక్రమానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ్ర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి జే. సత్యనారాయణా ముఖ్య అతిథిగా విచ్చేయగా సీ-డక్ డైరెక్టర్ జనరల్ రాజత్ మోనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ దర్భారీ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications








