ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు
రానున్న కాలంలో ఇండియాలో 4 కోట్ల మంది ప్రజలు డేంజర్ జోన్ లోకి వెళ్లనున్నారని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక హెచ్చరించింది.. అంతే కాకుండా కలకత్తా, ముంబై నగరాలు రానున్న కాలంలో పెను ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. దీనికంతటికి కారణం సముద్ర మట్టాలు పెరగడమేనని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక చెబుతోంది. దేశాల సరిహద్దుల్లో ఉన్న అన్ని దేశాలు పెద్ద ప్రమాదంలో చిక్కకోనున్నారని ఈ నివేదిక చెబుతోంది.
Read more: వీళ్లు మనుషులా లేక అతీంద్రియ శక్తులా..

ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు
జియో -6 (గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్ ఔట్ లుక్ - 6 వ ఎడిషన్) విడుదల కాగా, పసిఫిక్ మహా సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాలతో పాటు దక్షిణాసియా దేశాలూ ప్రమాదంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు
2050 నాటికి ఆసియా పసిఫిక్ రీజియన్ లో 10 దేశాలు ప్రమాదపు అంచుకు వెళతాయని తెలిపింది.

ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు
ఇండియాలో 4 కోట్ల మంది, బంగ్లాదేశ్ లో 2.5 కోట్ల మంది చైనాలో 2 కోట్ల మంది, ఫిలిప్పైన్స్ లో 1.5 కోట్ల మంది తమ ప్రాంతాలను వదిలి వెళ్లాల్సి వస్తుందని పేర్కొంది.

ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు
చాలా తీర ప్రాంత నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయని వెల్లడించిన ఈ నివేదిక, చైనా, ఇండియా, థాయ్ ల్యాండ్ వంటి కొన్ని దేశాల్లో జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న కాలుష్యం సముద్ర జలాలు ముందుకు వచ్చేందుకు కారణమవుతున్నాయని పేర్కొంది.

ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు
ఇండియాలో ముంబై, కోల్ కతాలతో పాటు చైనాలోని షాంగై, గువంజోవు, బంగ్లాదేశ్ లోని ఢాకా, మయన్మార్ లోని యాంగాన్, థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్, వియత్నాంలోని హోచి మిన్హ్, హై ఫోంగ్ నగరాలను పూర్తిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి 2070 నాటికి వస్తుందని అంచనా వేసింది.

ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు
కాగా ఇదివరకే నాసా ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. రానున్న సంవత్సరాల్లో సింగపూర్ ,టోక్యో ,ఫ్లోరిడా వంటి నగరాలు సముద్రంలో కలిసిపోతాయని హెచ్చరించిది.

ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు
వచ్చే వంద నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో సముద్ర మట్టం 3 అడుగుల మేర పెరగనుందని,భూమండలం అధిగమించలేని అతిపెద్ద ప్రమాణాల్లో ఇదొకటని నాసా సైంటిస్టులు వెల్లడించారు.

ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న సముద్ర మట్టానికి ఒక మీటరు ఎత్తులో 15 కోట్ల మంది నివసిస్తున్నారని వారందరూ మరో ప్రాంతానికి వెళ్లక తప్పదని ఆయన చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








