సెల్ఫీ పిచ్చి ఏకంగా ప్రాణాలే తీసింది
సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. రెండు రోజుల కిందట సెల్ఫీ తీసుకుంటూ గన్ ట్రిగ్గర్ నొక్కడంతో తీవ్రంగా గాయపడ్డ యువకుడు మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలాడు. వివరాల్లోకెళితే ఫఠాన్కోట్ కు చెందిన గురుకృపాల్ తన లైసెన్స్ డ్ రివాల్వర్ ని ఇంట్లో ఉంచి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు, ఇంట్లో ఉన్న 15 ఏళ్ల కుమారుడు రమన్ దీప్ సింగ్ తన తండ్రి రివాల్వర్ ని తీసి సోదరితో కలిసి సెల్ఫీ దిగే ప్రయత్నంలో ఫోన్ కెమెరాను నొక్కబోయి గన్ ట్రిగ్గర్ నొక్కాడు.

అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు పేలుడు శబ్తం గమనించి ఆసుపత్రికి తరలించగా రెండు రోజులు మృత్యువుతో పోరాడి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చివెళ్లాడు. సెల్ఫీల పిచ్చి జనాలకు ఎంత ముదిరిపోయిందంటే రిపోర్టులే ఆ వార్తను చూసి షాకవుతున్నాయి.
Read more: సెల్ఫీ దిగితే దెయ్యం చంపేసింది !

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసింది
యువత సాధారణంగా రోజుకు 14 సెల్ఫీలు క్లిక్ మనిపించే దాకా నిద్రపోరట.సెల్ఫీలు తీసుకునేవారిలో యవ్వన వయసు వారిదే అగ్రస్థానం. గూగుల్ సర్వే ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గూగుల్ సర్వేలో ఇదే విషయాన్ని వెల్లడించారు.

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసింది
రోజులో సుమారు 11 గంటలకు పైగా మొబైల్ వినియోగిస్తున్న వారు దాదాపు 14 సెల్ఫీలు,16 ఫోటోలు లేదా కొన్ని వీడియోలు తీసుకుంటారని గూగుల్ సంస్థ నిర్వహించిన సర్వే లో వెల్లడయింది.

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసింది
సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బుక్ ,ట్విట్టర్,ఇతర ఖాతాలను 21 సార్లు ఓపెన్ చేస్తుంటారని 25 టెక్ట్స్ మెసేజ్ లు పంపుతారని పరిశోధనలో తేలింది.

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసింది
ఇదిలా ఉండగా నడి వయస్కులు,అంతకంటే పెద్ద వయసున్నవారు మాత్రం రోజుకు నాలుగు ఫోటోలు ఓ వీడియో 2 నుంచి నాలుగు సెల్ఫీలు తీసుకుంటారట.

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసింది
టీనేజి వాళ్లయితే 6.9 ఫోటోలు,ఓ వీడియో,4 నుంచి 7 సెల్ఫీలు తీసుకుంటారు.

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసింది
ఈ నేపధ్యంలో గూగుల్ ఓ ఫోటో యాప్ ను విడుదల చేసింది. మరీ అధికంగా సెల్ఫీలు తీసుకోవడం ఓ మానసిక రుగ్మత గానే భావించాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు

గిజ్బాట్ పేజీని లైక్ చేయండి
లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








