Just In
- 5 min ago ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- 2 hrs ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 14 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 21 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Don't Miss
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహాభారతంలో మిస్టరీగా మారిన ఆయుధాలు,టెక్నాలజీకి దొరకని రహస్యాలు
మహాభారతం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.హాస్తినాపుర పీఠం కోసం కౌరవులు పాండవుల మధ్య జరిగిన ఆ సంగ్రామం చరిత్రలో ఓ ప్రముఖ ఘట్టం.
మహాభారతం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. హాస్తినాపుర పీఠం కోసం కౌరవులు పాండవుల మధ్య జరిగిన ఆ సంగ్రామం చరిత్రలో ఓ ప్రముఖ ఘట్టం. కురుక్షేత్రమనే ప్రదేశంలో జరిగింది కాబట్టి దీనిని కురుక్షేత్ర సంగ్రామం అనికూడా పిలుస్తారు.అయితే ఈ యుధ్ధంలో ఆటంబాంబును ప్రయోగించారంటూ కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. ఆ దిశగా పరిశోధనలు జరిపి తగిన రుజువులు చూపిస్తున్నారు. మరి నిజంగానే ఆ యుద్ధంలో బాంబులు పేల్చారా..
అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు
హస్తినాపురం పీఠంకోసం
హస్తినాపురం పీఠంకోసం పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన ఘోరమైన యుద్ధం అది. దాదాపు అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ యుద్ధం జరిగిన కురుక్షేత్రం అనే ప్రదేశం ఇప్పటి హర్యానా రాష్ట్రంలో ఉంది.
దాదాపు 18 రోజులు పాటు సాగిన ఈ యుధ్దంలో
దాదాపు 18 రోజులు పాటు సాగిన ఈ యుధ్దంలో గుట్టల కొద్ది సైనికుల శవాలు,ఆనవాలు కూడా పట్టలేని ఆత్మీయుల కళేబరాలతో పెను విషాద విజయంగా చరిత్రపుటలకెక్కింది.
ఆటంబాంబు ప్రయోగించారని
అంతటి ఘోరమైన యుద్ధంలో ఆటంబాంబు ప్రయోగించారని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పుడు ప్రయోగించిన అస్త్రాలు ఇప్పుడు మిస్సైల్స్ ను పోలి ఉన్నాయి. అలాగే అప్పటి ధనుష్ ఆయుధాలు ఇప్పుడు లాంచర్స్ గా మారాయి.
అంతటి డేంజరస్ మిస్సైల్స్ టెక్నాలజీ
అప్పుడు ప్రయోగించిన అస్త్రాలు ఇప్పటి మిస్సైల్స్ కన్నా చాలా శక్తివంతమైనవని అంతటి డేంజరస్ మిస్సైల్స్ టెక్నాలజీ అప్పట్లో వాడారని ఆ అస్త్రాల నుండి వెలువడిన కిరణాలు గామా కిరణాల కన్నా శక్తివంతమైనవని పరిశోధకులు రుజువు చేస్తున్నారు.
కృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రాన్ని
కృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రాన్ని మళ్లీ ప్రయోగించే మిసైల్స్ గా చెబుతున్నారు. ఇది శత్రువులను సంహరించి తిరిగి మళ్లీ కృష్ణుడి దగ్గరకు వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని ఇస్రో ఇలాంటి మిస్సైల్స్ రూపొందించే పనిలో ఉంది.
అత్యంత పవర్ పుల్ మిస్సైల్స్
బ్రహ్మశిర, బ్రహ్మస్త్ర, పాశుపతాస్త్ర, వైష్ణవాస్త్ర, నారాయణ అస్త్ర, ఆగ్నేయాస్త్ర, వామువాస్త్ర, నాగాస్త్ర,వజ్రాస్త్ర,వరుణాస్త్ర వంటి అస్త్రాలు అత్యంత పవర్ పుల్ మిస్సైల్స్ అని ఇప్పుడున్న మిస్సైల్స్ కన్నా ఎన్నో రెట్టు వేగంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
18 రోజుల్లో 1.5మిలియన్ల మంది ఎలా చనిపోతారని..
వీటిని బేస్ చేసుకుంటూ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించారని లేకుంటే కేవలం 18 రోజుల్లో 1.5మిలియన్ల మంది ఎలా చనిపోతారని సైంటిస్టులు వాదిస్తున్నారు. పదిహేను లక్షలకు పైగా పాండవ సైన్యం , ఇరవై నాలుగు లక్షలకు పైగా కౌరవ సైన్యం యుద్ధ పరిసమాప్తి నాటికి తుడిచిపెట్టుకుపోయింది.
ఈ స్తాయిలో మానవ హననం
ఈనాడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన చారిత్రాత్మక మహా సంగ్రామాలలో దేనిలో కూడా ఈ స్తాయిలో మానవ హననం జరిగిన దాఖలాలు లేవు.ఈ యుద్ధంలో పాల్గొన్న ఏ ఒక్క రాజు కూడా తిరిగి తన దేశాన్ని చేరలేదు. ఏ ఒక్క సైనికుడు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు.
బ్రహ్మస్త్రాన్ని 5వ జనరేషన్ మిస్సైల్ గా
ఆ యుద్ధంలో అర్జునుడు వాడిన బ్రహ్మస్త్రాన్ని 5వ జనరేషన్ మిస్సైల్ గా వర్ణిస్తున్నారు. ఆ మిస్సైల్ నుంచి వెలువడి కిరణాలు మొత్తం అక్కడి వాతావరణాన్ని వేడెక్కించాయి. ఆ వేడి ధాటికి ఎంతోమంది సైనికులు మాడిమసైపోయారు. ఈ వేడి దాదాపు 10 నాటికల్ మైళ్ల వరకు పాకింది.
బ్రిటన్ కు చెందిన పరిశోధకుడు డేవిడ్ డెవన్ పోర్ట్
దీనికి సాక్ష్యంగా బ్రిటన్ కు చెందిన పరిశోధకుడు డేవిడ్ డెవన్ పోర్ట్ పాకిస్తాన్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తూ కొన్ని నిజాలను వెలిబుచ్చారు. 2000 సంవత్సరాల క్రితం పాకిస్తాన్లోని ఓ నగరం పేలుడు కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. దానికి కారణం ఆటంబాంబును ప్రయోగించడమేనని తేల్చారు.
గత 12 సంవత్సరాల నుంచి అక్కడ హిందు చరిత్ర మీద..
ఈ పరిశోధకుడు గత 12 సంవత్సరాల నుంచి అక్కడ హిందు చరిత్ర మీద పరిశోధనలు చేస్తూ ఆధారాలను సేకరిస్తున్నాడు. అతడు పరిశోధన సాగిస్తున్న నగరాల్లో పురాతన నగరమైన మహంజోదారో కూడా ఉంది.
మహభారతంలోని ద్రోణ పర్వ ఘట్టంలో..
ఇతని పరిశోధనలతో తేలిందేంటంటే మహభారతంలోని ద్రోణ పర్వ ఘట్టంలో ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం ధాటికి క్షణాల్లో నగరమంతా మాడిమసైపోయిందని తేల్చారు. ఆ వేడికిరణాల ధాటికి ఇల్లు, గోడలు అన్నీ భస్మీపటలమైపోయాయని చెబుతున్నారు.
చాలా శక్తివంతమైన వారని..
అయితే వారు కూడా ఆ వేడిలో మాడిపోవాలి కదా అనే సందేహానికి దేవతలు చాలా శక్తివంతమైన వారని వారు అత్యంత శక్తివంతమైన వస్త్రాలు ధరించారని అందువల్ల ఆ వేడి వారిని ఏమి చేయలేకపోయిందని పరిశోధకులు చెబుతున్నారు.
అక్కడ పేల్చిన ఆటంబాంబులే..
రామాయణ, మహాభారత యుద్ధాల్లో జరిగిన ఘోర విషాదమే హరప్పా,మహంజోదారోలో జరిగిందని. అక్కడ పేల్చిన ఆటంబాంబులే ఇక్కడా పేలాయని ఇవి నాగసాకి,హిరోషిమా మీద వేసిన బాంబుల కంటే శక్తివంతమైనవని పరిశోధకులు చెబుతున్నారు.
హరప్పా మహంజోదారో మాడిమసైపోయిందని..
ఆ బాంబుల తాకిడికి హరప్పా మహంజదారో మాడిమసైపోయిందని వారు తేల్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇటలీ రచయిత మిలన్ రాసిన ఆటమిక్ డిస్ట్రక్షన్ 2000 బిసి నుంచి సేకరించారు.
హరప్పా ,మహంజదారో నాగరికత ధ్వంసమైపోవడానికి..
ఏది ఏమైనా హరప్పా ,మహంజదారో నాగరికత ధ్వంసమైపోవడానికి ప్రధాన కారణం ఈ ఆటంబాంబులేనన్నది పరిశోధకులు తేల్చిన సత్యం. లేకుంటే అంత పెద్ద నగరం శ్మశాన దిబ్బగా మారే అవకాశం లేదని చెబుతున్నారు.
50 నుంచి 80 అడుగుల ఎత్తులో కూడా కొన్నిచోట్ల ఇసుక మేటలు..
క్రీ.పూ.1700 నాటికి వరదల కారణంగా హరప్పా నాగరికత పతనమైంది. ఉపరితలానికి 50 నుంచి 80 అడుగుల ఎత్తులో కూడా కొన్నిచోట్ల ఇసుక మేటలు కనిపించాయి. కాబట్టి భారీ వరద సంభవించి నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉండొచ్చని చరిత్రకారుల ఊహ. అయితే అది వరదల వల్ల కొట్టుకుపోలేదని బాంబుల వల్ల నాశనం అయిందని మరికొంతమంది చరిత్ర కారుల వాదన.
అస్త్రశస్త్రాల నుంచి వెలువడిన రసాయనాలు..
అప్పుడు వదిలిన అస్త్రశస్త్రాల నుంచి వెలువడిన రసాయనాలు మానవాళిని సమూలంగా నాశనం చేసిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అప్పడు వదిలిన విషవాయువులే ఇప్పుడు కలియుగంలో తలెత్తుతున్న వైరీత్యాలకు కారణం అని కూడా చెప్పవలిసివస్తుంది.
కొన్నిలక్షల సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత..
మహాభారత యుద్దానంతరం కొన్నిలక్షల సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత చోటుచేసుకుంది. దీన్ని చీకటి కాలంగా భావించారని అనుకోవడానికి కొన్ని ఆధారాలు వున్నాయి. దీనిని గురించిన సమాచారం ప్రసక్తి కధాచరిత సాగరంలో కూడా వుంది. ప్రాచీన తమిళ సాహిత్యంలో సైతం ఈ చీకటి ఘట్టం గురించిన ప్రస్తావన వుంది.
ఆటంబాంబులు ఎంత ప్రమాకరమైందో చెప్పడానికి..
ఇక ఆటంబాంబులు ఎంత ప్రమాకరమైందో చెప్పడానికి హిరోషిమా, నాగసాకీ ఉదంతాలే సాక్ష్యం. ఆనాటి ఆటంబాంబు పేలుడు కలిగించిన అణు ధార్మిక ప్రభావం దుష్పరిణామాలను ఆ తరువాత అనేక తరాలు చవిచూడవలసి వచ్చింది.
అప్పుడు పేలిన ఆయుధాలు లక్షల మందిని క్షణకాలంలో..
ఇప్పుడున్న ఆయుధాలు చాలా నాసిరకమైనవని అప్పటి ఆయుధాలతో పోల్చుకుంటే ఇవి ఎందుకు పనికిరావని పరిశోధకులు చెబుతున్నారు. అదికూడా వాస్తవమేననుకోవాలి. ఎందుకంటే అప్పుడు పేలిన ఆయుధాలు లక్షల మందిని క్షణకాలంలో బూడిద చేశాయి. ఇప్పుడున్న ఆయుధాలకు అంత శక్తి లేకపోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470