ఐపీఎల్ ఫైనల్ని విజయ్ మాల్యా ఎలా ఎంజాయ్ చేశాడంటే..
భారత్ లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయల బకాయిలు పడి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. తన కొడుకు సిద్ధార్థతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను చూస్తే అందరూ ఔరా అని నోరు వెళ్లబెట్టాల్సిందే. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఏంచక్కా ఫారిన్ చెక్కేసిన ఈ లిక్కర్ సామ్రాట్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఎంజాయ్ చేసిన తీరు ఎలా ఉందో మీరే చూడండి.
Read more: చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్కార్ట్

ఐపీఎల్ ఫైనల్ని విజయ్ మాల్యా ఎలా ఎంజాయ్ చేశాడంటే..
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూశామంటూ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారిపోయింది.

ఐపీఎల్ ఫైనల్ని విజయ్ మాల్యా ఎలా ఎంజాయ్ చేశాడంటే..
ఇక్కడ, మేమిద్దరం కలిసి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాము' అని ఆ వీడియోలో సిద్ధార్థ పేర్కొన్నాడు. తనయుడు తన తండ్రిని కెమేరాతో షూట్ చేస్తుండగా... ‘గో ఆర్సీబీ' అంటూ విజయ్ మాల్యా అనడం గమనార్హం.

ఐపీఎల్ ఫైనల్ని విజయ్ మాల్యా ఎలా ఎంజాయ్ చేశాడంటే..
మాల్యా సంస్థలు ప్రమోట్ చేసిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్, హైదరాబాదు సన్ రైజర్స్ జట్ల మధ్య మొన్న బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్ ను సిద్ధార్థ మాల్యా... తన తండ్రి, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి లండన్ లోని తమ ఇంటిలో బిగ్ స్క్రీన్ పై వీక్షించారు.

ఐపీఎల్ ఫైనల్ని విజయ్ మాల్యా ఎలా ఎంజాయ్ చేశాడంటే..
ఆ సందర్భంగా తీసుకున్న సెల్పీ వీడియోను జూనియర్ మాల్యా ఫేస్బుక్లో అప్ లోడ్ చేశాడు. సదరు వీడియోలో సిద్ధార్థ చలాకీగా కనిపించగా, విజయ్ మాల్యా కూడా మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

ఐపీఎల్ ఫైనల్ని విజయ్ మాల్యా ఎలా ఎంజాయ్ చేశాడంటే..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇప్పటికే ఈ వీడియోను లక్షన్నర మంది నెటిజన్లు వీక్షించారు.
ఐపీఎల్ ఫైనల్ని విజయ్ మాల్యా ఎలా ఎంజాయ్ చేశాడంటే..
దానికి సంబంధించిన వీడియో ఇదే.. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో..

గిజ్బాట్ పేజీని లైక్ చేయండి
మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Source: Newzstreet TV


Click it and Unblock the Notifications








