ఐఫోన్లలో డిస్ప్లే సమస్య నిజమే: షాకిచ్చిన ఆపిల్
సర్వీసు చేసుకోవాలనుకుంటే రూ. 9,900 చెల్లించి, అదీ టచ్ డిసీజ్ ఉన్న ఫోన్లను మాత్రమే..
ప్రపంచంలో అందరూ అమితంగా అభిమానించే ఫోన్ ేదైనా ఉందంటే అది ఐఫోన్ మాత్రమే. ప్రతి ఒక్కరూ ఐఫోన్ సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. అది చేతిలో ఉందంటే ఆ స్టయిలే వేరు. కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 7 కూడా ఆ రేంజ్ లోనే అమ్మకాలు రాబట్టింది కూడా. అయితే ఐఫోన్ 7కి ముందు రిలీజ్ చేసిన ఐఫోన్ 6లో డిస్ ప్లే ప్రాబ్లం ఉందంటూ యూజర్లకు ఆపిల్ షాకిచ్చింది.
వెడ్డింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్..

డిస్ ప్లే సరిగా పనిచేయడం లేదని
తమ ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లలో ఆ సమస్య ఉన్న మాట వాస్తవమే ఆపిల్ సంస్థ ఒప్పుకుంది. ఒక్కోసారి డిస్ ప్లే సరిగా పనిచేయడం లేదని అంగీకరించింది.

సర్వీసు ఉచితం కాదని
ఈ సమస్యను పరిష్కరించేందుకు స్పెషల్ రిపేర్ ప్రోగ్రాంను లాంచ్ చేస్తున్నామని ఆపిల్ వెల్లడించింది. అయితే, ఈ సర్వీసు ఉచితం కాదని తేల్చి చెప్పింది.
లేటెస్ట్ ల్యాప్టాప్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సర్వీసు చేసుకోవాలనుకుంటే రూ. 9,900
సర్వీసు చేసుకోవాలనుకుంటే రూ. 9,900 చెల్లించి, అదీ టచ్ డిసీజ్ ఉన్న ఫోన్లను మాత్రమే రిపేర్ చేయించుకోవాలని చెప్పింది. ఈ విషయాన్ని కూడా ఆపిల కంపెనీనే తెలిపింది.

కంపెనీ కండిషన్లు
అయితే దీనికి కూడా కొన్ని కంపెనీ కండిషన్లు పెట్టింది. ఫోన్ వర్కింగ్ కండిషన్లో ఉండాలి, అలాగే డిస్ ప్లే పగిలి ఉండరాదంటూ అలా ఉంటేనే సర్వీసింగ్ చేస్తామంటూ తెలిపింది.

ఫోన్లపై ఒత్తిడి పడినప్పుడు
ఇక ఈ సర్వీస్ కేవలం ఐఫోన్ 6 ప్లస్ మోడల్ కు మాత్రమే వర్తిస్తుందట. ఫోన్లపై ఒత్తిడి పడినప్పుడు, ఇతర కొన్ని సందర్భాల్లో ఈ డిస్ ప్లే సమస్య వస్తున్నట్టు ఆపిల్ తెలిపింది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








