Asus నుంచి శక్తివంతమైన ఫోన్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో
తైవాన్కు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ Asus తన జెన్ఫోన్ మాక్స్ ఫోన్ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.9,999. శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో అసుస్ అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ను పవర్ బ్యాంక్లా వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
భారత్కు బ్లాక్బెర్రీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన జెన్ 2.0 యూజర్ ఇంటర్ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 1గిగాహెర్ట్జ్ క్వాడ్ - కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్ ఫోన్లో పొందుపరిచిన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ద్వారా 3జీ నెట్ వర్క్ పై 37.6 గంటల టాక్ టైమ్, 32.5 గంటల వై-ఫై వెబ్ బ్రౌజింగ్ ను ఆస్వాదించవచ్చని కంపెనీ చెబుతోంది.
Asus జెన్ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్

Asus జెన్ఫోన్ మాక్స్ స్పెసిఫికేషన్స్


Click it and Unblock the Notifications








