అదిరే ఫీచర్లతో జియోని పీ7 మ్యాక్స్
చైనా దిగ్గజం జియోని తన కొత్త స్మార్ట్ఫోన్ పీ7 మ్యాక్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో దూసుకుపోతున్న చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ జియోనీ పీ7 మ్యాక్స్ పేరుతో సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఆకృతితో పాటు అదిరే ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయని పీ7 మ్యాక్స్ వాడకం వినియోగదారులకు సరికొత్త అనుభవం ఇస్తుందని జియోనీ ఇండియా ఎండీ, సీఈవో అరవింద్ ఆర్. వొహ్రా తెలిపారు. ఫోన్ వినియోగంలో యూజర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఐఫోన్ 7 వాడేవారికి కూడా ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలియదు

డిస్ ప్లే
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే తో వచ్చిన ఈ ఫోన్ 2.2 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్ ను కలిగి ఉంది.

ర్యామ్
3 జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ తో ఫోన్ బయటకు వచ్చింది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా
కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ రియర్ కెమెరా తో పాటు సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచారు.

ఫింగర్ ప్రింట్ స్కానర్
ఫింగర్ ప్రింట్ స్కానర్, డబుల్ సిమ్ తో పాటు ఆండ్రాయిడ్ మార్ష్ మాలో 6.0 ఓఎస్ మీద రన్ అవుతుంది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాటరీ
3100 ఎంఏహెచ్ బ్యాటరీ తో ఫోన్ వచ్చింది. ఫోన్ బరువు 182 గ్రాములు. ధర రూ. 13,999

అదనపు ఫీచర్లు
ఆటో కాల్ రికార్డ్, యాంటి తెఫ్ట్, ఓటీసీ సపోర్ట్, డబుల్ క్లిక్ వేకప్ వంటి అదనపు ఫీచర్లను ఇందులో ఉన్నాయి. గోల్డ్, గ్రే-బ్లూకలర్ లో లభ్యమయ్యే ఈ ఫోన్లు అక్టోబర్ 17 నుంచి మార్కెట్ లో అందుబాటుకి వచ్చాయి.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








