రిలయన్స్ నుంచి మరో 4జీ ఫోన్
తాజాగా మరో కొత్త 4జీ ఫోన్ని మార్కెట్లోకి
అత్యంత తక్కువ ధరలకే 4జీ ఫోన్లను విడుదల చేసి ఇతర కంపెనీలకు సవాల్ విసురుతున్న రిలయన్స్ కంపెనీ తాజాగా మరో కొత్త 4జీ ఫోన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కంపెనీ దీని ధరను రూ. 6599గా నిర్ణయించింది. దీన్ని ఫ్లిప్కార్ట్లో ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనున్నారు. ఫోన్ స్పెసిషికేషన్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.
బేసిక్ ఫోన్తో బ్యాంకు సేవలు పొందడం ఎలా..?

జియో హ్యపీ న్యూ ఇయర్ ఆఫర్
ఈ ఫోన్ తో జియో హ్యపీ న్యూ ఇయర్ ఆఫర్ కూడా వస్తుంది. మర్చి 31 వరకు మీరు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలాగే డేటా సర్వీసులు కూడా పొందవచ్చు.

డిస్ ప్లే
డ్యూయెల్ సిమ్ తో వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 మీద పనిచేస్తుంది. 5.5 ఇంచ్ డిస్ ప్లే 720x1280 pixelsను కలిగి ఉంది.

ర్యామ్
1.5GHz octa-core Qualcomm Snapdragon 615 MSM8939 SoC తో పాటు 2GB ర్యామ్ 16 జిబి ఇంటర్నల్ స్టోరేజిని కలిగి ఉంది. మైక్రో ఎస్ డీ ద్వారా 32 జిబి వరకు విస్తరణ సామర్ధ్యం ఉంది.

కెమెరా
13 ఎంపీ కెమెరాతో పాటు 5 మెగా ఫిక్సల్ సెల్పీ కెమెరాను ఇందులో పొందుపరిచారు.

బ్యాటరీ
బ్యాటరీ విషయానికొస్తే 3000mAh బ్యాటరీ. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ మొబైల్. ఒక స్లాట్ లో 4జీ సిమ్ రెండో స్టాట్ లో 2జీ సిమ్ వాడుకొవచ్చు.


Click it and Unblock the Notifications








