రూ. 5,790 కే శాంసంగ్ కొత్త ఫోన్ , ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..?
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన సరికొత్త ఫోన్ జడ్ 4ని రిలీజ్ చేసింది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన సరికొత్త ఫోన్ జడ్ 4ని రిలీజ్ చేసింది. 4జీ వోల్ట్ సపోర్ట్ తో వస్తున్న ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది. టైజన్ పవర్ తో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 5,790గా నిర్ణయించింది. ఇది కంపెనీ ఆన్ లైన్ రీ స్టోర్లలో లభ్యమవుతుంది. ఫీచర్లపై ఓ లుక్కేయండి.
6జిబి ర్యామ్, 4 కెమెరాలతో Gionee S10

రెండు కలర్స్
శాంసంగ్ జడ్4 రెండు కలర్స్ లో వచ్చింది. బ్లాక్ అండ్ గోల్డ్స్ కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ ఫీచర్ ఫోన్ గా అప్ గ్రేడ్ అయిందని ఇండియాలోనే ఇది మొట్టమొదటి ఫోన్ కంపెనీ చెబుతోంది.

కెమెరా
కెమెరా విషయానికొస్తే 5 ఎంపీ రియర్ కెమెరాతో నచ్చిన విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ అభిమానుల కోసం 5ఎంపీ సెల్పీ కెమెరాను పొందుపరిచారు. ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ సపోర్ట్ కూడా ఉంది.

డిస్ ప్లే
4.5 ఇంచ్ WVGA (480x800 pixels) డిస్ ప్లేతో ఫోన్ వచ్చింది. 2.5 కర్వడ్ గ్లాసు ఫోన్ డిస్ ప్లేని సఏప్ గా ఉంచుతుంది.కంపెనీ నుంచి జడ్ సీరిస్ లో వచ్చిన ఫస్ట్ టైజన్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే.

ర్యామ్
ర్యామ్ విషయానికొస్తే 1 జిబి ర్యామ్ అలాగే 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మైక్రో ఎస్ డీ ద్వారా 128జిబి వరకు విస్తరించుకోవచ్చు.

బ్యాటరీ
బ్యాటరీ విషయానికొస్తే 2050mAh battery. 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth 4.0, USB 2.0, GP, అదనపు ఆకర్షణలు. బరువు 143 గ్రాములు


Click it and Unblock the Notifications








