20 ఎంపీ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో వివో V5 ప్లస్
జనవరి 23 న ఇండియాలో దీని లాంచింగ్ కార్యక్రమం
చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వివో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ వివో వీ5 ప్లస్ లాంచ్ చేసింది. సెల్పీ కెమెరాలకు పెట్టింది పేరైన వివో కంపెనీ ఇప్పుడు అదే తరహాలో 20 ఎంపీ సెల్పీ కెమెరాతో తన సరికొత్త ఫోన్ విడుదల చేసింది. దీని ధర రూ. 17980. జనవరి 23 న ఇండియాలో దీని లాంచింగ్ కార్యక్రమం ఉంటుందని కంపెనీ తెలిపింది. డ్యూయెల్ సెల్ఫీ కెమెరాలతో పాటు అత్యధిక రిజల్యూషన్ ఈ మొబైల్స్ సొంతమని కంపెనీ చెబుతోంది.
షియోమి నుంచి కొత్త ఫోన్ లీకయింది

5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే
ఫీచర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు1.5GHz ఆక్టాకోర్ MediaTek MT6750 ప్రాసెసర్ , గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది.

ర్యామ్
ర్యామ్ విషయానికొస్తే 4జిబి ర్యామ్ తో పాటు 32 జిబి ఇంటర్నల్ స్టోరేజి ఉంటుంది. మైక్రో ఎస్ డీ ద్వారా 128 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా
కెమెరా విషయానికొస్తే 20 ఎంపీ సెల్పీ డ్యూయెల్ కెమెరాతో అత్యధిక రిజల్యూషన్ సామర్ధ్యంతో ఫోటోలు తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ కెమెరా. అత్యధిక రిజల్యూషన్ ఉంటుంది.

3000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో మీద రన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ. బరువు 154.00 గ్రాములు.

అదనపు ఆకర్షణలు.
Wi-Fi, GPS, Bluetooth, USB OTG, FM, 3G and 4G అదనపు ఆకర్షణలు. క్రౌన్ గోల్డ్, గ్రే రంగుల్లో మొబైల్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








