షియోమి నుంచి కొత్త ఫోన్ లీకయింది
కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ వస్తోంది. రెడ్ మి నోట్ 4 ఎక్స్ పేరుతో రానున్న ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
షియోమి నుంచి వచ్చిన ఫోన్లు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ నుంచి వచ్చిన రెడ్ మి నోట్ 3 అయితే ఓ ప్రభంజనాన్నే సృష్టించింది. రికార్డు స్థాయి అమ్మకాలతో దిగ్గజాలకే ముచ్చెమటలు పట్టించింది. ఇప్పుడు అదే కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ వస్తోంది. రెడ్ మి నోట్ 4 ఎక్స్ పేరుతో రానున్న ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఇకపై మీ ఇంటికే జియో సిమ్, డెలివరీ చేయనున్న స్నాప్డీల్

రెడ్ మి నోట్ 4 ఎక్స్
షియోమి నుంచి త్వరలో రెడ్ మి నోట్ 4 ఎక్స్ పేరిట త్వరలో ఓ ఫోన్ వినియోగదారుల ముందుకు రానుంది. ఇప్పటికే నోట్ 4 చైనాలో విడుదలవ్వగా ఇది త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే ఊపులో అమ్మకాలు
జనవరి నాటికి భారత మార్కెట్లోకి రెడ్ మి నోట్ 4 , 4ఎక్స్ ఫోన్లు రానున్నాయని సమాచారం. ఇప్పటికే ఇండియా మార్కెట్లో రెడ్ మి నోట్ 3, 3 ఎస్ ప్రైమ్ భారీగా అమ్మకాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇవి కూడా అదే ఊపులో అమ్మకాలు జరుగుతాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

అత్యాధునిక స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్ను
రానున్న ఈ ఫోన్ లో అత్యాధునిక స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్ను వాడినట్లు తెలుస్తోంది. ఇది ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేస్తుందని కంపెనీ చెబుతోంది.

రామ్
ఇందులో 4 జీబీ రామ్ తో పాటు 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ పొందుపరిచారు. రెడిమి నోట్ 4 రెండు వేరియంట్లలో విడుదలయన విషయం తెలిసిందే. 2GB RAM/16GB ROM and 3GB/64GB ROMతో ఈ ఫోన్ చైనా మార్కెట్లో రిలీజయింది.

హెచ్డీ డిస్ ప్లే
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఓఎస్తో ఈ ఫోన్ మూడు రంగుల్లో లభ్యమవనుంది. దీని ధర సుమారు రూ .12 వేలు నుంచి 15 వేలు ఉండే అవకాశం ఉంది.

కెమెరా
కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్పీ షూటర్ తో రానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








