ఆ ఫోన్పై 28జిబి 4జీడేటా వస్తోంది
చైనా కంపెనీ షియోమి భారత్లో లాంచ్ చేసిన రెడ్మి 4ఏ కొనుగోలు వారికి ఆఫర్లను ప్రకటించింది.
చైనా కంపెనీ షియోమి భారత్లో లాంచ్ చేసిన రెడ్మి 4ఏ కొనుగోలు వారికి ఆఫర్లను ప్రకటించింది. ఈ మొబైల్ కొనుగోలు చేసిన ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు 28జీబీ డేటాను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మి.కామ్, అమెజాన్ రెండు ఆన్లైన్ ప్లేస్లో ఈ ఫోన్ ను కంపెనీ ఆవిష్కరించింది. రెడ్ మి 4ఏను అధికారికంగా లాంచ్ చేసిన వెంటనే ఐడియా కస్టమర్ల కోసం కంపెనీ ఈ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది.
రోజుకు 2జిబి డేటా, జియోకి దిమ్మతిరిగింది

రూ.343తో రీఛార్జ్ ప్యాక్ వేసుకుంటేనే
ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారు రూ.343తో రీఛార్జ్ ప్యాక్ వేసుకుంటేనే ఈ 28జీబీని పొందుతారని కంపెనీ పేర్కొంది.

అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేసి వారికే
మరోవైపు ఈ ఆఫర్లన్నీ కూడా అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేసి వారికే వర్తించనున్నాయి. అమెజాన్ ఇండియాలో రెడ్ మి4ఏ ను కొనుగోలు చేసిన ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు 28జీబీ 4జీ డేటాను రూ.343 ప్యాక్ తో అందించనున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

రోజుకు 1జీబీ డేటా
ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ డేటా వాడుకోవచ్చని పేర్కొంది. దాంతో పాటు రెడ్ మి4ఏ కస్టమర్లు రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్, నెలకు 3000 లోకల్, ఎస్టీడీ ఎస్ఎంఎస్ లను పొందనున్నారని షియోమి వెల్లడించింది.

2017 జూన్ 30 తర్వాత
ఈ రీచార్జ్ ప్యాక్ కేవలం 28 రోజుల వరకే ఉండనుంది. 28 రోజుల తర్వాత కూడా రూ343 ప్యాక్ పై ఈ ఆఫర్లనే పొందవచ్చు. ఈ 2017 జూన్ 30 తర్వాత ఈ ప్యాక్ గడువు ముగుస్తుంది.

ధర రూ.5,999
రెడ్ మి 4ఏ గురువారం నుంచి మి.కామ్, అమెజాన్ ఇండియాల్లో విక్రయానికి రానుంది. దీనిధర రూ.5,999. ఆఫ్లైన్ ద్వారా ఇది అందుబాటులో ఉండదు. మి.కామ్లో కొనుగోలుచేసిన కస్టమర్లకు ఎలాంటి ఆఫర్లను కంపెనీ ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications








