భారీ బ్యాటరీతో జెడ్‌టీఈ బ్లేడ్ A2 Plus

ఈ బడ్జెట్ ఫోన్ అతి పెద్ద బ్యాటరీతో వస్తోంది.ఫిబ్రవరి 6 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్టులో దీన్ని విక్రయించనున్నారు.

By Hazarath
|

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ జెడ్‌టీఈ తన లేటెస్ట్ మొబైల్‌ను ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జెట్‌టీఈ బ్లేడ్ ఎ2 ప్లస్ పేరుతో వస్తున్న ఈ బడ్జెట్ ఫోన్ అతి పెద్ద బ్యాటరీతో వస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ మార్కెట్లోకి దిగింది. ఫిబ్రవరి 6 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్టులో దీన్ని విక్రయించనున్నారు. సిల్వర్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ధరను కంపెనీ రూ. 11,999గా నిర్ణయించింది. ఫీచర్లపై ఓ లుక్కేయండి.

 

ఆధార్ ఇస్తామంటూ ఎన్నో ఫేక్ సైట్లు, ఓ కన్నేయండి

డిస్‌ప్లే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5 డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే తో పాటు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 లాంటివి అదనపు పీచర్లు.

ప్రాసెసర్

ప్రాసెసర్

ప్రాసెసర్ విషయానికొస్తే 1.5 గిగాహెడ్జ్ 64-బిట్మీడియాటెక్ ఎంటి6750ఎంటి ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం.

ర్యామ్
 

ర్యామ్

3జీబీ, 4జీబీ ర్యామ్ లతో రెండు వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. సిల్వర్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ఇండియాలో 4జీబీ వేరియంట్లో లభించనుంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కూడా ఉంది.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే వెనుకభాగంలో 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను పొందుపరిచారు. ముందర బాగంలో 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచారు.

అతి భారీ బ్యాట

అతి భారీ బ్యాట

అతి భారీ బ్యాటరీ సామర్ధ్యంతో, వేగవంతమైన ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ హైలైట్ అని కంపెనీ చెబుతోంది. 22 గంటల వరకు టాక్ టైమ్ అందిస్తుందని తెలిపింది. బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్.

Best Mobiles in India

English summary
ZTE Blade A2 Plus launched in India at Rs. 11,999, sale debuts on February 6 Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X