సైబర్ కోరల్లో భారత కంపెనీలు విలవిల
భారత్ లోని కంపెనీలు సైబర్ కు వేదికలవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ కంపెనీలు పైబర్ భారీన పడి విలవిలలాడుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 72శాతం భారత కంపెనీలు సైబర్ ఎటాక్ కు గురయ్యానని, వాటి నుంచి బయటపడేందుకు అవి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఏపీఎంజీ సైబర్ క్రైం సర్వే నివేదిక-2015 తేల్చింది. ప్రతి రోజు ఏదో ఒక కంపెనీ ఈ ఎటాక్ కు గురవుతున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 'ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తం 72శాతం కంపెనీలు సైబర్ దాడులకు గురయ్యాయి. తమ సంస్థలకు అతిపెద్ద ప్రమాదం సైబర్ దాడుల వల్లే వస్తుందని 94శాతం కంపెనీలు తెలియజేశాయి' అని సర్వే తెలిపింది. కంపెనీలు హ్యాకింగ్ గురవతుంలే సామాన్యులు ఒక లెక్కనా...? ఈ సంధర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే హ్యాకర్ల భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Read more: ఆ తొమ్మిది మరణాలకు కారణం సైబర్ వేధింపులే!

మీ వెబ్సైట్ను హ్యాకర్ ప్రూఫ్గా ఉండాలంటే
మీ వెబ్సైట్ను హ్యాకర్ ప్రూఫ్గా ఉండాలంటే మీ వెబ్సైట్లోని సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అందుకుఅనుగుణంగా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఈ చర్యను క్రమంగా పాటించినట్లయితే హ్యాకర్లు విజృంభించే అవకాశం ఉండదు.

శక్తివంతమైన పాస్వర్డ్లను..
శక్తివంతమైన పాస్వర్డ్లను ఉపయోగించటం ద్వారా హ్యాకర్ల చొరబాటును నిరోధించవచ్చు.

గూగుల్స్ వెబ్ మాస్టర్ టూల్స్లో రిజిస్టర్ అయినట్లయితే..
మీ వెబ్సైట్, గూగుల్స్ వెబ్ మాస్టర్ టూల్స్లో రిజిస్టర్ అయినట్లయితే మాల్వేర్ దాడులు జరిగిన సమయంలో తక్షన నోటిఫికేషన్ మీకు అందుతుంది. తద్వారా రక్షణాత్మక చర్యలకు పూనుకోవచ్చు.

హ్యాకర్ల భారి నుంచి రక్షణ పొందే కమ్రంలో
ప్రముఖ వెబ్ కంపెనీలు హ్యాకర్ల భారి నుంచి రక్షణ పొందే కమ్రంలో సెక్యూరిటీ సేవలనందించే సంస్థలను నియమించుకుంటున్నాయి.

హ్యాకింగ్ నిరోధానికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను
ఈ సంస్థలు హ్యాకింగ్ నిరోధానికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను కలిగి సదరు కంపెనీ వెబ్సైట్కు సంబంధించి నిరంతర పర్యవేక్షణను నిర్వహిస్తాయి.

స్టాప్ ద హ్యాకర్, సైట్ లాక్, సుకురీ..
స్టాప్ ద హ్యాకర్, సైట్ లాక్, సుకురీ, క్వాలిస్ వంటి సంస్థలు ఈ తరహా సెక్యూరిటీ సేవలనందిస్తున్నాయి.

సంవత్సారినికి కొంత మొత్తం..
ఈ సెక్యూరిటీ సంస్థలను నియమించుకున్నట్లయితే సంవత్సారినికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








