రూ. 25కే 1జిబి డేటా..ఆఫర్ ఎక్కడంటే ?
రిలయన్స్ జియోకి పోటీగా ఎయిర్టెల్ మరో సంచలనానికి తెరలేపింది. రూ. 249కే 10 జిబి డేటాను కష్టమర్లకు అందిస్తోంది. అయితే ఆ అవకాశం కేవలం గుజరాత్ కష్టమర్లకే మాత్రమే దక్కనుంది. అక్కడ ఎయిర్టెల్ 4జీ లాంచ్ సంధర్భంగా ఈ ఆఫర్ ని ప్రకటించింది.గుజరాత్లో ఎయిర్టెల్దే ఆధిపత్యం కావడంతో కష్టమర్లను మరింతగా ఆకట్టుకోవడానికి ఈ ఆఫర్ ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఆఫర్ వివరాలు ఏంటో ఓ సారి చూద్దాం.

ప్రతి 4జీ హ్యండ్ సెట్ పై
గుజరాత్ కష్టమర్లు కొనే ప్రతి 4జీ హ్యండ్ సెట్ పై రూ. 249 ఛార్జితో 10 జిబి డేటాను అందిస్తారు. ఇది ప్రిపెయిడ్ కష్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

రూ. 249తో రీఛార్జ్ చేసుకున్న వెంటనే
అయితే ఇందులో మీరు రూ. 249తో రీఛార్జ్ చేసుకున్న వెంటనే మీకు 1జిబి డేటా లభిస్తుంది. మిగతా 9జిబి డేటాను మీరు మెసేజ్ ద్వారా పొందుతారు.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

52141కు ఎసెమ్మెస్
కష్టమర్లు "4G offer" అని టైప్ చేసి 52141కు ఎసెమ్మెస్ చేస్తే మీకు మిగతా 9జిబి డేటా యాడ్ అవుతుందని కంపెనీ తెలిపింది.

రూ. 1495 ప్లాన్ తో
ఇప్పటికే రూ. 1495 ప్లాన్ తో ఎయిర్ టెల్ 10 జిబి డేటాను అందిస్తోంది. అలాగే 1498 ప్లాన్ తో 6జిబి హై స్పీడ్ 4జీ డేటాతో పాటు ప్రతి నెలా 1జిబి డేటాను రూ. 51కే 12 నెలలపాటు అందిస్తోంది.
లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుజరాత్ లో ఎయిర్ టెల్
ఇప్పటికే గుజరాత్ లో ఎయిర్ టెల్ 1800MHz spectrum బ్యాండ్ ని లాంచ్ చేసింది. పూర్తి స్థాయిలో 4జీ సర్వీసులను ప్రారంభించాలని కసరత్తు చేస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








