Just In
- 7 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 9 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 9 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 12 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జియో ఉద్యోగులకు పండగే పండగ
టెలికాం సెక్టార్లో ఉన్న పోటీ వల్ల అత్యున్నత స్థాయి ఉద్యోగులు కంపెనీ వీడి వెళుతుండటంతో రిలయన్స్ జియో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వారిని కాపాడుకునేందుకు కంపెనీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారికి దసరా కానుకగా భారీగా వేతనాలను పెంచింది. ప్రతిభావంతులను కాపాడుకునే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది.
టార్గెట్ రూ.5 లక్షల కోట్లు: వచ్చింది రూ.60 వేల కోట్లు
జియో ఆపరేషన్లో
జియో ఆపరేషన్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఎగ్జిక్యూటివ్లకు జీతాలను దాదాపు 15శాతం వరకు పెంచింది. జూనియర్, మధ్యశ్రేణి మేనేజర్లకు 15శాతం వరకు జీతం పెంచగా.. డీజీఎం ఆపై అధికారులకు 10శాతం వరకు జీతం పెంచింది.
దాదాపు అన్ని విభాగాలకు
నెట్వర్క్, ఐటీ సపోర్ట్, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్, ప్రాజెక్టు, రెగ్యులేటరీ, హెచ్ఆర్ విభాగాలకు చెందిన వారికీ ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.
ఉద్యోగుల హోదాను బట్టి
ఉద్యోగుల హోదాను బట్టి జూనియర్లకు 7నుంచి 15శాతం, మధ్యశ్రేణిలో 5 నుంచి 10శాతం పెంచారు. టెలికం సెక్టార్లో తాము ఇచ్చిన ఇంక్రిమెంట్లు మరే కంపెనీ ఇవ్వలేదని జియో హెచ్ఆర్ కన్సల్టెంట్ తెలిపారు.
వార్షిక ఇంక్రిమెంట్ కింద
వార్షిక ఇంక్రిమెంట్ కింద తమ జూనియర్, మిడిల్ స్థాయి ఉద్యోగులకు 7 శాతం నుంచి 15 శాతం వేతనాలను పెంచనున్నట్టు జియో గతేడాది చివర్లోనే ప్రకటించింది. పెరిగిన వేతనాలు ఏప్రిల్-మే నుంచి ఉద్యోగులకు అందుతాయని తెలిపింది.
పెంపు కొన్ని రోజులుగా వాయిదా
కానీ ఆ పెంపు కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ వేతనాలను రిలయన్స్ జియో పెంచినట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో ఉద్యోగులు అందుకుంటున్న వార్షిక ఇంక్రిమెంట్స్ ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా బాగున్నాయని ఓ ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ చెప్పింది.
సర్వీసులు ఆవిష్కరించిన కొన్ని రోజులకే
గతనెలలోనే రిలయన్స్ జియో సంచలనం సృష్టిస్తూ 4జీ సేవలను లాంచ్ చేసింది. కానీ ఆ సర్వీసులు ఆవిష్కరించిన కొన్ని రోజులకే ఉన్నత స్థాయి ఉద్యోగులు కొంతమంది కంపెనీకి రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలకు సరియైన కారణాలు తెలియరాలేదు.
కంపెనీని వీడిన ఉన్నత ఉద్యోగులు
చీఫ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ సోరెన ఎల్ హన్సన్, డేటా సైన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హరిచరణ్ రావు, సెక్యూరిటీ ఆపరేషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మాయ ఆర్ నాయర్, పబ్లిక్ వైఫై బిజినెస్ హెడ్ పవన్ ఎస్ యాదవ్లు కంపెనీని వీడి వెళ్లిపోయారు. అంతకు ముందు జియో మొబిలిటీ బిజినెస్ హెడ్ అమితాబ్ జైపూరియా కూడా సంస్థను వీడారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470