రూ. 499కే 35జిబి 4జీ డేటా..అయితే..?
జియోకి పోటీగా ఎయిర్టెల్ కొత్త కొత్త ఆపర్లను ప్రకటిస్తూ పోతోంది.
జియోకి పోటీగా ఎయిర్టెల్ కొత్త కొత్త ఆపర్లను ప్రకటిస్తూ పోతోంది. అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇందులో భాగంగా తమ యూజర్ల కోసం డోంగిల్ ఆఫర్ ని ప్రవేశపెట్టింది.నెల రోజుల కాలపరిమితితో రూ.499కే 35జిబి డేటాను ప్రవేశపెట్టింది. దీన్ని ఎలా పొందాలంటే..
జియో ప్లాన్లు మారాయి, యూజర్లకు ఇక తిప్పలే !

ఎయిర్టెల్ డోంగిల్
ముందుగా ఎయిర్టెల్ డోంగిల్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ. 3 వేలు ఉన్న ఎయిర్టెల్ డోంగిల్ ఇప్పుడు రూ.1500లకే లభ్యమవుతోంది. అయతే దీన్ని ఎయిర్టెల్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

రూ. 499
ఆ తరువాత రూ. 499తో రీ ఛార్జ్ చేసుకుంటే చాలు. మీకు 35జిబి 4జీ డేటా లభిస్తుంది. ఇది నెల రోజుల వ్యాలిడిటీ.

సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్
కాగా సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ని ఇటీవలే ఎయిర్టెల్ మూడు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే..

మరో మూడు నెలల పాటు
ఈ పొడిగింపుతో పోస్ట్ పెయిడ్ యూజర్లకు మరో మూడు నెలల పాటు 10 జిబి చొప్పున ఉచిత డేటా లభిస్తుంది.



Click it and Unblock the Notifications








