Bharti Airtel చందాదారులకు మరొక ఫ్రీ ఆఫర్
ప్రాణాంతక కరోనావైరస్ (కోవిడ్ -19 ) వైరస్ ను ఎదుర్కోవటానికి ప్రజలు అందరు తమను తాము ఇంట్లో నిర్బందించుకోవలసి వచ్చింది. ఇంటి యొక్క దిగ్బంధ కాలంలో ఉన్నంత వరకు భారతి ఎయిర్టెల్ తన చందాదారుల కోసం వేలాది E-బుక్స్ లను జగ్గర్నాట్ పుస్తకాలపై ఉచితంగా ప్రకటించింది.

ఎయిర్టెల్ బుక్స్
జగ్గర్నాట్ వేలాది పుస్తకాలను కలిగి ఉండడమే కాకుండా అధికారికంగా ఎయిర్టెల్ బుక్స్ అని పిలువబడింది. ఇది పాఠకులకు ఈ సమయంలో అమృతం లాగా ఉపయోగపడుతుంది. ప్రజలు పఠనం చేపట్టేలా చూడటానికి జగ్గర్నాట్ # రీడిన్స్టెడ్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది ప్రజలను తమ యొక్క నవలలు చదవడానికి మరియు పఠనం యొక్క అభిరుచిని అభివృద్ధి చేస్తుంది.

ఎయిర్టెల్ మరియు జగ్గర్నాట్
వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవడానికి ప్రభుత్వం భారతదేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ ను ప్రకటించింది. ఇది మాత్రమే కాదు సామాజిక దూరాన్ని అనుసరించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అటువంటి సమయాల్లో ఎయిర్టెల్ అందిస్తున్న వేలాది e-బుక్స్ ల ఫ్రీ యాక్సిస్ ప్రజలకు అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది మరియు వాటిని ఇళ్లలో నిమగ్నమై ఉచితంగా చదవవచ్చు. భారతి ఎయిర్టెల్ యొక్క సిటిఓ ఆదర్శ్ నాయర్ దీని గురించి ఇలా పేర్కొన్నారు ఎయిర్టెల్ మరియు జగ్గర్నాట్ సామాజిక దూరాన్ని అనుసరిస్తున్నందున ప్రజలు తమ ఇళ్లలో నిమగ్నమయ్యే వారికి ఆసక్తి గల పాఠకులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎయిర్టెల్ డిజిటల్ కంటెంట్
ఎయిర్టెల్ తన చందాదారుల కోసం వివిధ ప్లాట్ఫామ్లలో వినూత్న డిజిటల్ కంటెంట్ను తీసుకురావడం కొనసాగిస్తుంది. ఇండియాలో కొత్త రకమైన పఠనం మరియు పాఠకుల కోసం జగ్గర్నాట్ ను రూపొందించబడింది. జగ్గర్నాట్ లవ్, వ్యాపారం, ఆధ్యాత్మికత, ఆహారం వంటి మరెన్నో వివిధ ప్రక్రియల నుండి కూడా ఇ-బుక్స్ మరియు నవలలను అందిస్తుంది. జగ్గర్నాట్ లోని కొన్ని ప్రసిద్ధ బుక్స్ పాఠకులకు ఎక్కువ ఆసక్తిని కలిగించేవి చాలా ఉన్నాయి. ఇందులో టోనీ జోసెఫ్ రాసిన ఎర్లీ ఇండియన్స్, సుధీర్ సీతాపతి సిఇఓ ఫ్యాక్టరీ వంటివి మరెన్నో ఉన్నాయి. ఎయిర్టెల్ చందాదారులు జగ్గర్నాట్ పుస్తకాలను ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ మరియు వింక్ యాప్
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ భారతి ఎయిర్టెల్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కంటెంట్ ప్లాట్ఫామ్లలో ఒకటి. ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ తన వినియోగదారులకు ఉత్తమ స్ట్రీమింగ్ కంటెంట్ను అందించడానికి వేలాది ప్రదర్శనలు మరియు చలన చిత్రాలతో పాటు లైవ్ టీవీని అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా వింక్ మ్యూజిక్ యాప్ సంగీత ప్రియులకు నాలుగు మిలియన్ పాటలు మరియు క్యూరేటెడ్ మ్యూజిక్ యాప్ను కూడా అందిస్తుంది. అలాగే చందాదారులు వింక్ యాప్లో అత్యధిక నాణ్యతతో చాలా రకాల కళా ప్రక్రియలను వినవచ్చు.

ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్
బ్రాడ్బ్యాండ్ యొక్క స్పీడ్ విషయంలో ఇండియా ఇతర దేశాలతో పోటీపడుతోంది. ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ఫైబర్తో సహా వివిధ ISPలు కూడా 1 Gbps వేగంతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. 2019 చివరిలో భారతి ఎయిర్టెల్ తన బ్రాడ్బ్యాండ్ ధరలను క్రమబద్ధీకరించింది. ఇది ఇప్పుడు కేవలం రూ.999 నుండి 100Mbps వేగంతో నాలుగు ప్లాన్లను అందిస్తోంది. ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ఫైబర్ ఇప్పుడు తన బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ల్లా మీద అందిస్తున్న ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెల్సుకోవడానికి ముందుకు చదవండి.


Click it and Unblock the Notifications








