జియోతో పోటీకి సై..దుమ్మురేపుతున్న Bsnl కొత్త ఆఫర్లు
టెల్కోలకు ముచ్చెమటలు పట్టిస్తున్న రిలయన్స్ జియో దెబ్బకు దిగ్గజ కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టెల్కోలకు ముచ్చెమటలు పట్టిస్తున్న రిలయన్స్ జియో దెబ్బకు దిగ్గజ కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని టెల్కోలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రైవేట్ టెలికం సంస్థలకు పోటీగా ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ..సమ్మర్ డాటా బొనాంజా పేరుతో ప్రత్యేక డాటా ఆఫర్లను ప్రకటించింది. ఆపర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
జీమెయిల్ వాడుతున్నారా, ఈ ప్రమాదకర వార్త మీ కోసమే !

రూ.78లతో రీచార్జి
రూ.78లతో రీచార్జి చేసుకున్న వారు ఐదు రోజుల్లో 2.2 జీబీ డాటాను వాడుకోవచ్చు.

రూ.98లకు
అలాగే రూ.98లకు 1.2 జీబీ డాటాను 14 రోజుల్లో, రూ.155లకు 2.2 జీబీని 15 రోజుల్లో వినియోగించుకోవచ్చు.

రూ.156
రూ.156తో 3.2జీబీని 10 రోజుల్లో, రూ.198తో రీచార్జి చేసుకున్న వారు 3.2 జీబీ డాటాను 24 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది.

రూ.212
దీంతోపాటు 30 రోజుల కాలపరిమితితో రూ.212తో రీచార్జ్ చేసుకున్నవారు 10 జీబీ డాటాను పొందవచ్చునని తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్టీవీ రూ. 3099
అదేవిధంగా కాంబో ఎస్టీవీ రూ. 3099 రీచార్జీతో అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, 1500 ఎస్ఎంఎస్, రోజుకు 80 కేబీపీఎస్ స్పీడ్తో 1జీబీ డాటాను, 90 రోజుల కాలపరిమితితో ఈ ఆఫర్ను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications








