వద్దంటే మీకే నష్టం: ఇండియాకి చైనా ఘాటైన హెచ్చరికలు
ఇండియాలో చైనా వస్తువులు బాయ్కాట్ చేయాలనే ప్రచారంపై చైనా భారత్కు హెచ్చరికలు చేసింది.
సందు చిక్కితే కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు ఇండియాకు ఘాటైన హెచ్చరికలు చేసింది. చైనా వస్తువులను అధికారికంగా నిషేధించడం వల్ల నష్టపోయే భారత్ మాత్రమేనంటోంది డ్రాగన్ కంట్రీ. దీంతో పాటు భారత్లో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం వల్ల చైనాపై పెద్దగా ప్రభావమేమీ చూపదని చైనా స్పష్టం చేసింది. చైనా ప్రపంచంలోనే అత్యధికంగా వస్తువులు ఎగుమతి చేసే దేశమంటూ గొప్పలు చెప్పుకుంది.
చైనా ఉత్పత్తుల బహిష్కరణ ఎండమావే ! షాకింగ్ కారణాలు ఇవే

చైనా భారత్కు హెచ్చరికలు
ఇండియాలో చైనా వస్తువులు బాయ్కాట్ చేయాలనే ప్రచారంపై చైనా భారత్కు హెచ్చరికలు చేసింది.

పెట్టుబడులపై చెడు ప్రభావం
చైనా పాకిస్తాన్కు మద్దతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. భారత్లో చైనా వస్తువులను నిషేధించాలని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీని వల్ల భారత్లో చైనా కంపెనీల పెట్టుబడులపై చెడు ప్రభావం చూపిస్తుందని, ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని చైనా హెచ్చరించింది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చైనా ఎగుమతులపై
ఈ ప్రచారం వల్ల చైనా ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపదని.. దీని వల్ల భారత్కే ఎక్కువ నష్టం జరుగుతుందని డ్రాగన్ కంట్రీ తెలిపింది .

వస్తువులకు సరైన ప్రత్యామ్నాయం లేకపోతే
చైనా వస్తువులకు సరైన ప్రత్యామ్నాయం లేకపోతే భారత వ్యాపారులు, వినియోగదారులు అధికంగా నష్టపోతారని ఢిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

భారత్లో చైనా వస్తువుల అమ్మకం 30 శాతం
చైనా ప్రపంచంలోనే అత్యధికంగా వస్తువులు ఎగుమతి చేసే దేశమని తెలిపింది. అయితే చైనా వస్తువుల నిషేధం ప్రచారంతో.. దీపావళి సీజన్లో భారత్లో చైనా వస్తువుల అమ్మకం 30 శాతం తగ్గినట్లు ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది.

భారతీయులవి అరుపులే

చైనాకు దిమ్మతిరిగింది
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








