HD బాక్స్ అప్గ్రేడేషన్ చార్జీలను తగ్గించిన డిష్ టీవీ
డిష్ టివి ఇండియా మరొక కొత్త ఆఫర్తో మన ముందుకు వచ్చింది. ఈ కొత్త ఆఫర్లో భాగంగా ఎస్డి సెట్-టాప్ బాక్స్ను వినియోగిస్తున్న వినియోగదారులు కేవలం 799 రూపాయలకే హెచ్డి సెట్-టాప్ బాక్స్కు అప్గ్రేడ్ ను పొందవచ్చు. దేశంలోని అతిపెద్ద డిటిహెచ్ సంస్థ ఈ ఆఫర్ను ఇప్పుడు మరింత ఆకర్షించడానికి ప్రవేశపెట్టింది. వినియోగదారులు HD సెట్-టాప్ బాక్స్కు మారడానికి దీనికంటే మంచి తరుణం మరొకటి ఉండదు.

ఈ ఆఫర్లో భాగంగా ఇందులో నెలవారీ ప్యాక్ కూడా ఉంటుంది. అంతేకాకుండా డిష్ టీవీ సంస్థ తన పాత SD సెట్-టాప్ బాక్స్ను తీసుకుంటుంది మరియు కస్టమర్ ఇంట్లో కొత్త HD సెట్-టాప్ బాక్స్ను ఇన్స్టాల్ చేస్తుంది. ఎయిర్టెల్ డిజిటల్ టివి మరియు టాటా స్కై కూడా ఎస్డి సెట్-టాప్ బాక్స్ నుండి హెచ్డి సెట్-టాప్ బాక్స్కు అప్గ్రేడ్ చేయడానికి తక్కువ వసూలు చేస్తున్నాయి.

ఎయిర్టెల్ డిజిటల్ టివి వంటివి తమ వినియోగదారులను SD సెట్-టాప్ బాక్స్ నుండి హెచ్డి సెట్-టాప్ బాక్స్కు 699 రూపాయలు (రూ. 150 ఇంజనీర్ ఛార్జీలు మినహాయించి) అప్గ్రేడ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే ఎయిర్టెల్ డిష్ టివి తన HD అప్గ్రేడేషన్తో పాటు ఎటువంటి ఛానల్ ప్యాక్ను అందించడం లేదు.

డిష్ టీవీ హెచ్డీ సెట్-టాప్ బాక్స్ అప్గ్రేడేషన్ ఛార్జీల తగ్గింపు వివరాలు
స్టాండర్డ్ డెఫినిషన్ సెట్-టాప్ బాక్స్ ఉన్న డిష్ టీవీ వినియోగదారులందరూ కంపెనీకి 799 రూపాయలు చెల్లించి హెచ్డి సెట్-టాప్ బాక్స్కు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. డిష్ టీవీ ఎస్డీ బాక్స్ వినియోగదారులు అప్గ్రేడ్ కోసం కంపెనీకి యొక్క కస్టమర్ నెంబర్ కు కాల్ చేయవచ్చు. అప్గ్రేడేషన్ పొందడానికి వెచ్చించిన మొత్తంలో 119 రూపాయల విలువైన ఒక హెచ్డి ఛానల్ ప్యాక్ను కూడా డిష్ టీవీ అందిస్తోంది. కాబట్టి హెచ్డి బాక్స్ కోసం కంపెనీ కేవలం 680 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది.

డిష్ టీవీ వినియోగదారులకు విస్తృత శ్రేణి హెచ్డి ఛానల్ ప్యాక్లను అందిస్తోంది. HD సెట్-టాప్ బాక్స్లో కూడా వినియోగదారులు SD ఛానెల్లను చూడగలరు. కాని SD ఛానెల్లతో పోలిస్తే HD ఛానెల్లు ఐదు రెట్లు మంచి స్పష్టతను అందిస్తాయని కంపెనీ తెలిపింది. డిష్ టీవీ వినియోగదారులు తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తాము కోరుకున్న ఛానల్ ప్యాక్ను ఎంచుకోవచ్చు. స్పెషల్ హెచ్డి ఇండియా క్రికెట్ సర్వీస్ ప్యాక్ ను 119 రూపాయల ప్రత్యేక ధర వద్ద పొందవచ్చు.

మరొక కంపెనీలతో పోలికలు
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కూడా తన వినియోగదారులను SD సెట్-టాప్ బాక్స్ నుండి HD సెట్-టాప్ బాక్స్కు అప్గ్రేడ్ చేయడానికి అనుమతిస్తుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ యూజర్లు 699 రూపాయల అప్గ్రేడేషన్ ఛార్జీలు మరియు రూ.150 ఇంజనీర్ ఛార్జీలు చెల్లించి హెచ్డీ బాక్స్కు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ బాక్స్ కోసం వినియోగదారులు రూ.1,999 మరియు రూ .250 ఇంజనీర్ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది.

టాటా స్కై కూడా SD సెట్-టాప్ బాక్స్ నుండి వినియోగదారులను HD సెట్-టాప్ బాక్స్కు అప్గ్రేడ్ చేయడానికి 899 రూపాయలు వసూలు చేస్తోంది. అలాగే ఎయిర్టెల్ డిజిటల్ టీవీ మరియు టాటా స్కై రెండూ అప్గ్రేడ్ చేసేటప్పుడు తమ వినియోగదారులకు ఎటువంటి ఛానల్ ప్యాక్ని అందించవు. కాబట్టి ఇక్కడ కూడా డిష్ టీవీ మంచి ప్రయోజనంతో అందిస్తోంది. ఎస్డి బాక్స్ నుంచి హెచ్డి బాక్స్కు అప్గ్రేడ్ చేసినందుకు డి 2హెచ్ కూడా 799 రూపాయల ఛార్జీలు వసూలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








