Coronavirus వ్యాప్తి అడ్డుకట్టకు విరాళాలను ప్రకటించిన టెక్ సంస్థల CEOs
ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనావైరస్ వ్యాధి బారిన పడింది. అన్ని రకాల సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పనిచేయమని కూడా కోరాయి. ఈ వైరస్ యొక్క వ్యాప్తిని ఎదురుకుంటున్న ఆరోగ్య సంరక్షణ కార్మికులకు తమ వంతు సహాయంగా మొత్తం 720,000 మాస్క్ లను తమ సంస్థ విరాళంగా ఇస్తున్నట్లు ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఆస్ట్రేలియా యొక్క అడవి ప్రాంతంలో మంటల చెలరిగిన సమయంలో ఈ ముసుగులు కొన్నట్లు ఫేస్బుక్ సంస్థ తెలిపింది.

జుకర్బర్గ్ ఫేస్బుక్ పోస్ట్
"అందరి కంటే ఎక్కువగా ఆరోగ్య కార్యకర్తలకు మరింత అత్యవసరమైన రక్షణ గేర్ ఇప్పుడు చాలా అవసరం. ఆస్ట్రేలియా అడవి ప్రాంతంలో మంటలు చెలరేగినప్పుడు సహాయం కోసం మేము కొనుగోలు చేసిన 720,000 మాస్క్లను ఇప్పుడు ఫేస్బుక్ సంస్థ విరాళంగా ఇచ్చింది. మేము విరాళం ఇవ్వడానికి మిలియన్ల కొద్దీ సోర్సింగ్ కోసం కూడా పని చేస్తున్నాము. మీరందరూ ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంటారని నేను నమ్ముతున్నాను అని జుకర్బర్గ్ ఫేస్బుక్ పోస్ట్లో రాశారు".

టెస్లా చీఫ్
టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ కూడా జుకర్బర్గ్ ఫేస్బుక్ పోస్ట్కు ప్రతిస్పందనగా టెస్లా సంస్థ కూడా ఫేస్ మాస్క్లను అందిస్తున్నది అని తెలిపారు.ప్రస్తుత పరిస్థితులలో మస్క్ సహాయం చేయమని పిలుపునిచ్చిన ట్వీట్కు ప్రతిస్పందిస్తూ ట్వీట్లో రాశారు.

ఆపిల్,అలీబాబా CEO
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా అమెరికాలోని ఆరోగ్య నిపుణులకు ప్రత్యేకమైన మిలియన్ల మాస్క్లను విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా 1.8 మిలియన్ మాస్క్లు, 210,000 టెస్ట్ కిట్లు, 36,000 ప్రొటెక్టివ్ సూట్లు, వెంటిలేటర్లు మరియు థర్మామీటర్లను 10 ఆసియా దేశాలకు అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, కంబోడియా, లావోస్, మాల్దీవులు, మంగోలియా, మయన్మార్, నేపాల్,పాకిస్తాన్ మరియు శ్రీలంక వంటి దేశాలలో అత్యవసర వైద్య సామాగ్రిని విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు.

మహీంద్రా CEO
మహీంద్రా గ్రూప్ సిఇఒ కూడా తన సంస్థ తయారు చేసిన వెంటిలేటర్లను, దాని రిసార్టులను తాత్కాలిక సంరక్షణ సౌకర్యాలుగా అందిస్తుందని ప్రకటించింది. ఈ ప్రయోజనం కోసం తన ఒక నెల జీతం విరాళంగా ఇస్తానని కూడా తెలిపారు.


Click it and Unblock the Notifications








