గూగుల్ అవుట్... ఫేస్బుక్ ఇన్
న్యూస్ సైట్ల రద్దీలో గూగుల్ ను ఫేస్బుక్ వెనక్కు నేట్టేసింది. ఏమిటీ..ఈ విషయం ఆశ్చర్యం కలిగిస్తుందా.. అవును ఇది నిజం. గూగుల్ కంటే ఫేస్బుక్ లోనే న్యూస్ చూసే వినియోగదారులు ఎక్కువ ఉన్నారని సర్వే వెల్లడించింది. న్యూస్ సైట్ల రద్దీపై పర్సాడాట్ లీ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఫేస్ బుక్,ట్విట్టర్ లో షేర్ చేసిన లింకులు ఇంటర్ నెట్ వినియోగదారులకు వార్తల కోసం ప్రధాన వనరుగా మారాయని సంస్థ పేర్కొంది. మీడియా సైట్లకు సంబంధించి 43 శాతం రద్దీ ఫేస్ బుక్ వేదికగానే నడుస్తోందని ఈ విషయంలో గూగుల్ ట్రాఫిక్ 35 శాతానికే పరిమితం అయిందని పర్సాడాట్లీ తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ట్రాఫిక్ రేసులో ఫేస్ బుక్ గూగుల్ ను అధిగమించిడం ఇది తొలిసారి కాదు. గత అక్టోబర్ లోనే గూగుల్ పై ఫేస్ బుక్ స్వల్ప ఆదిక్యం కనబరిచింది. కానీ ఇప్పుడు భారీ ఆదిక్యాన్ని కనబరిచింది.
Read more at: భారత్లో అడుగడుగునా ఫోక్స్కాన్..

ఫేస్ బుక్ ఓ వార్తా సారధి
న్యూస్ సైట్లను చూడటంలో వినియోడదారులు ఎక్కువగా ఫేస్ బుక్ నే ఆశ్రయిస్తున్నారు. ఫేస్ బుక్ 43 శాతాన్ని ఆక్రమిస్తే..గూగుల్ 35 శాతానికి పరిమితమైంది.

ఫేస్ బుక్ ఓ వార్తా సారధి
ఫేస్ బుక్ నుంచి ఎక్కువగా న్యూస్ ట్విట్టర్ కు షేర్ అవుతోంది. అందువల్ల న్యూస్ రద్ధీ కూడా పెరిగిందని గణాకాంలు చెబుతున్నాయి

ఫేస్ బుక్ ఓ వార్తా సారధి
న్యూస్ ప్రపంచంలో కూడా తనకు తిరుగులేదని ఫేస్ బుక్ రెండో సారి నిరూపించుకుంది. గతంలో స్వల్ప ఆధిక్యం కనబరిచినా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆదిక్యం కనబరిచింది

ఫేస్ బుక్ ఓ వార్తా సారధి
గణాంకాలను వెల్లడించిన సైట్ ఇదే.

ఫేస్ బుక్ ఓ వార్తా సారధి
ఇక ఫేస్ బుక్ కు ,గూగుల్ కు మరోసారి న్యూస్ ప్రపంచంలో పోటీ తప్పదని పరిశీలకులు అంటున్నారు.

ఫేస్ బుక్ ఓ వార్తా సారధి
న్యూస్ రద్దీ విషయంలో ఫేస్ బుక్ ..గూగుల్ ని తలదన్నడంతో సోషల్ మీడియాలో ఇలా కొన్ని చిత్రాలు హల్ చల్ చేస్తున్నాయి


Click it and Unblock the Notifications








