మరో 5 రైల్వే స్లేషన్లలో గూగుల్ ఉచిత వైఫై
భారత్లోని 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని అందించడమే లక్ష్యంగా రైల్టెల్ నెట్వర్క్ తో కలిసి గూగుల్ పనులు మొదలు పెట్టిన సంగతి విదితమే. గూగుల్ నుంచి ఉచిత వైఫై సౌకర్యం పొందుతోన్న జాబితాలో మరో ఐదు రైల్వేస్టేషన్లు చేరాయి.
Read more: ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సదుపాయాన్ని పొందుతోన్న రైల్వేస్టేషన్ల సంఖ్య 15కి చేరింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందించనున్నట్లు ఈ సందర్భంగా గూగుల్ సంస్థ పేర్కొంది. తాజాగా ఉజ్జయిని, జైపూర్, పాట్నా, గువాహటి, అలహాబాద్ లోని రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
Read more: ఆండ్రాయిడ్ పై గూగుల్ పట్టు కోల్పోతోందా..?

ఇప్పటికే పుణే, భువనేశ్వర్, భోపాల్, రాంచీ, రాయ్పూర్, విజయవాడ, కాచీగూడ(హైదరాబాద్), ఎర్నాకులం జంక్షన్(కొచి), విశాఖపట్నం, ముంబై, రైల్వేస్టేషన్లకు ఉచిత వైఫై సౌకర్యం కల్పించారు.


Click it and Unblock the Notifications








