నాలుగు వారాల్లో మీ సూచనలు తెలపండి!
సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా వేధింపులకు గురువుతున్న భారతీయ చిన్నారుల పట్ల ఆందోళనకు గురైన ఢిల్టీ హైకోర్టు, చిన్నారుల ఆన్లైన్ వినియోగం పట్ల తీసుకోవల్సిన భద్రతా చర్యలను నాలగు వారాల్లోపు సూచించాలని ఫేస్బుక్ ఇంకా గూగుల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. బిడి అహ్మద్, విబు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసకున్నట్లయితే ఫేస్బుక్ ఇంకా ఇతర సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్లను వినియోగిస్తున్న మైనర్ల సంఖ్య అధికంగా పెరుగుతోంది.

శక్తివంతమైన సమాచార మాద్యమాల్లో సోషల్ నెట్వర్కింగ్ ఒకటి. ఫేస్బుక్.. ట్విట్టర్ వంటి ప్రముఖ సామాజిక బంధాల వెబ్సైట్లు విస్తృత సమాచార వ్యవస్థను కలిగి ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ మీడియా మరింతగా విస్తరిస్తున్న నేపధ్యంలో అనే దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లైంగిక వేధింపులు... జాతి విమర్శలు... ఆర్ధిక మోసాలు... సమాచార దోపడి ఇలా అనేక రకాలైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఎక్కవవుతున్నాయి. సోషల్ నెట్వర్కింగ్ యూజర్లను జాగృతం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయకూడిన పలు కీలక అంశాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








